breaking news
	
		
	
  disabled candidate
- 
      
                   
                                                     
                   
            దివ్యాంగులపై ‘రీవెరిఫికేషన్’ అస్త్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దివ్యాంగ పింఛన్ దారులకు రీ వెరిఫికేషన్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఏళ్ల తరబడి పెన్షన్ తీసుకుంటున్నా టీడీపీ కూటమి ప్రభుత్వం వాటి సంఖ్యను ఎలాగైనా కుదించాలన్న కుట్రతో వెరిఫికేషన్ ప్రక్రియకు తెరతీసింది. వైకల్యం నిరూపించుకోవాలంటూ ఇప్పటికే లబ్ధిదారులకు ఒకసారి నోటీసులిచ్చి రీవెరిఫికేషన్ పూర్తిచేయగా.. ఇప్పుడు తాజాగా ఈనెల 8 నుంచి మరోమారు వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. విడతల వారీగా నోటీసులివ్వడం ప్రారంభించింది. నిజానికి.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అనర్హుల ఏరివేత పేరిట పింఛను అర్హతను నిరూపించుకోవాలంటూ నోటీసులు జారీచేసింది. మంచానికి పరిమితమైన వ్యాధిగ్రస్తులు 24,091 మందితో పాటు దివ్యాంగుల కోటా పింఛన్లు పొందుతున్న 7,86,091 మందితో కలిపి రాష్ట్రంలో మొత్తం 8.18 లక్షల మందికి వైద్యపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, వీరిలో కొందరికే నోటీసులిచ్చి 5.50 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. దాదాపు లక్ష మంది లబ్ధిదారులు అనర్హులంటూ వీరి పింఛన్లు పూర్తిగా రద్దుకు రెండునెలల క్రితమే ప్రభుత్వం నోటీసులు జారీచేసింది.అలాగే, 30వేల మందికి వారు ప్రస్తుతం పొందుతున్న రూ.15 వేల పింఛన్ను రూ. 6వేలు లేదా రూ. 4 వేలకు మార్చేందుకు కూడా నోటీసులిచ్చింది. అయితే, వీటిని అందుకున్న దివ్యాంగ, వైద్య పింఛను లబ్ధిదారులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టడం.. పింఛన్ల భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వ కుట్రలను ‘సాక్షి’ ఎండగట్టడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సెప్టెంబరు ఒకటిన జరిగే పింఛన్ల పంపిణీని నిలిపివేస్తామని చెప్పి వాయిదా వేసింది. అయితే, తన పంతం ఎలాగైనా నెగ్గించుకోవాలన్న లక్ష్యంతో ఇప్పుడు మళ్లీ రీవెరిఫికేషన్ అంటోంది. రెండు నెలల క్రితం పింఛను రద్దు లేదంటే పింఛన్ కేటగిరి మార్పునకు నోటీసులిచ్చిన వారిలో దాదాపు 1.10 లక్షల మందికి ఈనెల 8న మళ్లీ వైద్య పరీక్షలు మొదలుపెట్టనుంది. ఈసారి పరీక్షల్లో అనర్హులుగా తేలితే పింఛను పూర్తిగా రద్దుచేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆసుపత్రుల వద్దే పరీక్షలు.. ఇక పెరాలసిస్, తీవ్ర కండరాల బలహీనత వంటి వ్యాధులతో మంచం నుంచి కదలలేని స్థితిలో ఉంటూ ఫించన్లు పొందుతున్న 24 వేల మంది లబ్ధిదారులకు తొలివిడత వైద్య పరీక్షలను ఇంటివద్దే నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు రెండో విడతలో మాత్రం ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాల్సిందేనని తాజా మార్గదర్శకాల్లో తేలి్చచెప్పింది. వీరిలో ఎంపికైన అతికొద్ది మందికి మాత్రమే రోజుకు ఐదుగురు చొప్పున 108 లేదా 104లో ఆస్పత్రులకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.టీడీపీ సానుభూతిపరులకైతే నో వెరిఫికేషన్..ఇదిలా ఉంటే.. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ రాజకీయ వేధింపుల మాదిరిగా ఉందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే.. మొత్తం 8.18 లక్షల మంది దివ్యాంగ, వైద్య పింఛను లబ్ధిదారులందరినీ అప్పట్లో రీవెరిఫికేషన్ జరుపుతున్నట్లు ప్రకటించి.. వీరిలో కేవలం ఐదున్నర లక్షల మందికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించి, వారిలో లక్ష మందికి పూర్తిగా పింఛను రద్దుకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఇప్పుడు వీరికి మళ్లీ రెండో విడత రీ వెరిఫికేషన్ వైద్య పరీక్షలు మొదలుపెడుతున్నారు. అయితే, దాదాపు రెండున్నర లక్షల మంది టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న దివ్యాంగ పింఛనుదారులకు ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం గమనార్హం.మిగిలిన వారి మీద మాత్రం ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులంటూ టీడీపీ నేతల ప్రోద్బలంతో ముద్రవేసి వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, దాదాపు పదిహేను ఏళ్ల క్రితం కేంద్రం దేశవ్యాప్తంగా నిర్వహించిన జనగణనలో రాష్ట్రవ్యాప్తంగా 12,19,785 మంది దివ్యాంగులు ఉన్నారని తేలింది. కానీ, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఈ కేటగిరీ పెన్షనర్ల సంఖ్య అంతకన్నా చాలా తక్కువే. అయినా.. ఇందులోనూ కోత విధించేందుకు గత ప్రభుత్వం అనర్హులకు ఇచ్చిందంటూ రీవెరిఫికేషన్ జపం చేస్తోంది. - 
  
    
                
      కళ్ళు కనిపిస్తున్నాయా..? పెన్షన్ ఎలా ఆపుతారు..?
 - 
      
                   
                                                     
                   
            కీబోర్డు, మౌస్ లేకుండానే.. కంప్యూటర్ పనిచేస్తుంది!
కీబోర్డు, మౌస్, టచ్ స్క్రీన్, వాయిస్ కమాండ్ల వంటివి లేకుండా కంప్యూటర్తో పనిచేయించడాన్ని ఊహించగలమా? స్మార్ట్ రిస్ట్ బ్యాండ్తో.. దాన్ని సుసాధ్యం చేయనుంది మార్క్ జుకర్బర్గ్కు చెందిన మెటా సంస్థ. కేవలం మన చేతివేళ్ల కదలికలతో, వాటి సంజ్ఞలతో కంప్యూటర్లూ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)తో పనిచేసే వస్తువులను ఇకమీదట నియంత్రించవచ్చు! టెక్నాలజీ వాడకంలో ఇదో గొప్ప మలుపు కానుంది. ముఖ్యంగా దివ్యాంగులకు ఇది వరం. మాట (వాయిస్) లేదా సాధారణ ఇన్పుట్ పద్ధతులు పనిచేయని సందర్భాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.భవిష్యత్తులో మన చేతివేళ్ల కదలికలతోనే కంప్యూటర్కు అన్నీ చెప్పేయొచ్చు, వాటిని నియంత్రించవచ్చు. ముఖ్యంగా రహస్యమైన విషయాలను ఎవ్వరికీ తెలియకుండా నిర్భయంగా కంప్యూటర్లో కంపోజ్ చేయొచ్చు.. సెర్చ్ చేయొచ్చు.. ఒకటేమిటి.. మనకు నచ్చినవన్నీ చేయొచ్చు. మెటా సంస్థ తయారుచేస్తున్న స్మార్ట్ రిస్ట్ బ్యాండ్తో ఇవన్నీ సాధ్యం కానున్నాయి. టెక్నాలజీ వినియోగంలో ఇదో విప్లవాత్మక మార్పుగా చెబుతున్నారు టెక్ నిపుణులు. ఇప్పటికే వాయిస్ కమాండ్స్తో పనిచేసే స్మార్ట్ కళ్లజోళ్లను మెటా రూపొందించింది.మెటా రియాలిటీ ల్యాబ్స్లో..: ఈ సాంకేతికతకు సంబంధించిన పురోగతిని ఇటీవల ప్రముఖ జర్నల్ ‘నేచరల్’లో మెటా ప్రచురించింది. మెటాకు చెందిన వ్యాపార, పరిశోధనా విభాగం ‘రియాలిటీ ల్యాబ్స్’లో ఈ పరిశోధనలు నిర్వహించారు. సుమారు 300 మంది వివిధ రకాల పనులు చేస్తుంటే.. వారి కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలను పసిగట్టేందుకు మెషీన్ లెర్నింగ్ మాడ్యూళ్లకు శిక్షణ ఇచ్చారు. ఆ మోడళ్లు వారి కండరాల సందేశాలను విజయవంతంగా గ్రహించి, వారి కదలికలకు అనుగుణంగా పనిచేశాయి. ఈ రిస్ట్ బ్యాండ్ని మెటా ఆగ్మెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు ‘ఓరియన్’తోనూ పరీక్షించారు.ఎలా పనిచేస్తుంది?..: మన మెదడు.. నరాల ద్వారా కండరాలకు విద్యుత్ సంకేతాలు పంపుతుంది. వీటిని ఎలక్ట్రోమయోగ్రాఫిక్ (ఈఎమ్జీ) సంకేతాలు అంటారు. మన మణికట్టు దగ్గర ఉండే కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాల ఆధారంగా పనిచేసే రిస్ట్ బ్యాండ్ని మెటా కంపెనీ తయారుచేసింది. దీని సాయంతో కంప్యూటర్లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)తో పనిచేసే వస్తువులను నియంత్రించవచ్చు. ఇకమీదట కీబోర్డులు, మౌస్లు లేదా స్క్రీన్ను టచ్ చేయడం వంటివేవీ అవసరం ఉండదు. కంప్యూటర్లతో పనిచేయించడం మరింత సులభతరం, సరళతరం కానుంది. మన జేబుల్లో చేయి పెట్టి వేళ్లు కదిలించినప్పుడు కూడా ఇది పనిచేయడం విశేషం.ఏమిటీ సాంకేతికత?సాధారణంగా ఎలక్ట్రోమయోగ్రాఫిక్ (ఈఎమ్జీ) సంకేతాలు శరీరం లోపలి నుంచి వస్తాయి. వాటిని గ్రహించి బయట నుంచి పనిచేస్తుంది కాబట్టి దీన్ని ‘ఉపరితల ఈఎమ్జీ (ఎస్ఈఎమ్జీ) సాంకేతికతగా పిలుస్తున్నారు. ఇది చాలా తేలికైన రిస్ట్ బ్యాండ్. మనం చేతిని కదిలినప్పుడు కండరాల నుంచి వచ్చే అతి సూక్ష్మ లేదా స్వల్ప స్థాయి విద్యుత్ సంకేతాలను కూడా గ్రహించి పనిచేయడం దీని ప్రత్యేకత. పెద్దపెద్ద పరికరాలు, యంత్రాల అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. కెమెరాలు, కొన్ని రకాల సెన్సర్లతో పనిచేసే వ్యవస్థలు మన సంజ్ఞలను గుర్తించి పనిచేస్తాయి. కానీ, మన కదలికలు స్పష్టంగా లేకపోతే ఇవి పనిచేయవు. కానీ, మన మెదడు – కంప్యూటర్ లేదా న్యూరో మోటార్ ఇంటర్ఫేస్లు.. అంటే మన శరీరం నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలతో పనిచేసే వాటితో ఈ సమస్య ఉండదని ఈ అధ్యయన కర్తలు చెబుతున్నారు.దీంతో ఏమేం చేయొచ్చు?⇒ ఒక టేబుల్ లేదా మన తొడ లేదా డెస్క్ లాంటి దానిపై మనం రాసిన దాన్ని కూడా ఈ రిస్ట్ బ్యాండ్ గుర్తించి, మనం ఏం రాశామో కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తుంది.⇒ మెసేజ్లు టైప్ చేయొచ్చు⇒ మెనూలు నియంత్రించ వచ్చు⇒ చేతుల కదలికల ద్వారా డిజిటల్ కంటెంట్ను మనకు నచ్చినట్టు యాక్సెస్ చేయవచ్చుఎవరికి ఉపయోగం?దివ్యాంగులకు..⇒ శరీరంలోకి ప్రత్యేకమైన ఇంప్లాంట్లు లేదా సంక్లిష్టమైన పరికరాలు జొప్పించాల్సిన అవసరం లేకుండానే.. వివిధ శారీరక సామర్థ్యాలు ఉన్న వ్యక్తులకు..⇒ సాధారణ ఇన్ పుట్ పరికరాలను ఉపయోగించడంలో ఇబ్బంది పడుతున్నవారికి ..⇒ బహిరంగంగా లేదా ప్రైవేటుగా మాట్లాడలేని సందర్భాల్లో ఏదైనా విషయాన్ని రహస్యంగా అవతలివారికి చేరవేయాల్సి వచ్చినప్పుడు..మరిన్ని ఆవిష్కరణల కోసం..ప్రస్తుతానికి ఈ సాంకేతికత పూర్తిగా అభివృద్ధి కాలేదు. మన శరీరం నుంచి వచ్చే సంకేతాలను గుర్తించే పరికరాలను భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యమని మెటా చెబుతోంది. ఈ సాంకేతికతకు సంబంధించిన డేటా, సాఫ్ట్వేర్ మోడళ్లు, డిజైన్ మార్గదర్శకాలను పరిశోధకులతో పంచుకునేందుకు మెటా ముందుకు వచ్చింది. తద్వారా.. కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాల ఆధారంగా పనిచేసే మరిన్ని సాంకేతికతల ఆవిష్కరణలకు ఇది తోడ్పాటు అందించనుంది. - 
      
                   
                                                     
                   
            టీడీపీ నేత కుట్ర... దివ్యాంగుని పింఛను కోత
శ్రీరంగరాజపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పింఛను లబి్ధదారులపై కొరడా ఝుళిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఓ దివ్యాంగుడి పింఛన్ను టీడీపీ నాయకుడు రద్దు చేయించారు. దీంతో బాధితుడు గురువారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. శ్రీరంగరాజపురం మండలం, పద్మాపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు హేమాద్రి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాధవనాయుడి ఇంటి వద్ద కూలి పనులు చేయడానికి నిరాకరించారు. దీంతో కక్ష పెంచుకున్న మాధవనాయుడు అధికారులపై ఒత్తిడి పెంచి హేమాద్రికి వస్తున్న వికలాంగ పింఛను తొలగించడమే కాకుండా దుర్భాషలాడి కుటుంబం అంతు చూస్తానని బెదిరించాడు. హేమాద్రికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ మొత్తం హేమాద్రికి వచ్చే పింఛన్పైనే ఆధారపడి జీవిస్తోంది. దీంతో బాధితుడు హేమాద్రి గురువారం శ్రీ రంగరాజపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు యతి్నస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అలాగే, మండలంలోని జీఎంఆర్ పురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఢిల్లీకి వస్తున్న వికలాంగ పింఛన్ కూడా తొలగించారని, తనకు కూడా పింఛన్ను పునరుద్ధరించకపోతే ఆత్మహత్యే శరణ్యమని హెచ్చరించారు. - 
      
                   
                               
                   
            దశాబ్దానికి దక్కిన న్యాయం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో ప్రమాదానికి గురై వికలాంగుడిగా మారిన ఓ కండక్టర్ తనకు రావాల్సిన వేతన బకాయిల కోసం దశాబ్దం కాలంగా చేస్తున్న న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఆ కండక్టర్కు 2001 నుంచి 2007 వరకు వేతన బకాయిలను, ఇతర ఉద్యోగులు (కండక్టర్లు)తో సమానంగా అన్ని ఇంక్రిమెంట్లను కలిపి ఆరు శాతం సాధారణ వార్షిక వడ్డీతో సహా రెండు నెలల్లో చెల్లించాలని ఏపీఎస్ ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ తీర్పు చెప్పారు. వైకల్యం బారిన పడిన ఉద్యోగిని వదిలేయకుండా అతనికి గతంలో నిర్వహించిన పోస్టుకు సమానమైన ప్రత్యామ్నాయ పోస్టును, అదే జీతం, సర్వీసు ప్రయోజనాలతో సహా కల్పించాల్సిన బాధ్యత యజమానిగా ఆర్టీసీపై ఉందని స్పష్టంచేశారు. అధికారులు పట్టించుకోలేదు... కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన సీహెచ్ రాజేశ్వరరావు ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తూ ప్రమాదానికి గురవడంతో ఆయన వెన్నెముకకు వైద్యులు శస్త్రచికిత్స చేసి రెండు డిస్క్లను తొలగించారు. వైకల్యం కారణంగా రాజేశ్వరరావును ఆర్టీసీ యాజమాన్యం 2001లో రిటైర్ చేసింది. దీంతో రాజేశ్వరరావు 2005లో డిజేబుల్డ్ కమిషనర్ వద్ద కేసు దాఖలు చేశారు. విచారణ చేసిన కమిషనర్, అంగవైకల్య చట్ట నిబంధనల ప్రకారం పిటిషనర్ వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను 2006లో ఆదేశించారు. దీంతో 2007లో ఆర్టీసీ అధికారులు రాజేశ్వరరావును తిరిగి సర్వీస్లో చేర్చుకున్నారు. బస్స్టేషన్లో ఆయన సర్వీసులను ఉపయోగించున్నారు. తనను రిటైర్ చేసిన 2001 నుంచి 2007 మధ్య కాలానికి సంబంధించిన బకాయిలన్నింటినీ చెల్లించడంతోపాటు కండక్టర్ కేడర్లో తనకు పే ఖరారు చేయాలని రాజేశ్వరరావు పలుమార్లు కోరారు. ఆర్టీసీ అధికారులు స్పందించకపోవడంతో ఆయన 2011లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల జస్టిస్ రవినాథ్ తిల్హరీ తుది విచారణ జరిపారు. ‘అంగవైకల్య చట్టంలోని సెక్షన్ 47(1) ప్రకారం సర్వీసులో ఉండగా ప్రమాదానికి గురైన ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించడం గానీ, ర్యాంకును తగ్గించడం గానీ చేయకూడదు. ఆ ఉద్యోగి గతంలో నిర్వహించిన పోస్టుకు çసమానమైన పోస్టు లేకపోతే తగిన పోస్టు ఇచ్చేంత వరకు ఆ ఉద్యోగి కోసం సూపర్ న్యూమరరీ పోస్టు సృష్టించి అందులో కొనసాగించాలి. వైకల్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ కేసులో హైకోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తోంది. పిటిషనర్కు 2001 నుంచి 2007 వరకు వేతన బకాయిలు, ఇంక్రిమెంట్లతోపాటు ఆరు శాతం సాధారణ వార్షిక వడ్డీ కలిపి రెండు నెలల్లో చెల్లించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. - 
      
                   
                               
                   
            వరంగల్ పార్లమెంట్ స్థానానికి వికలాంగ అభ్యర్థి

 సాంబమూర్తినగర్ (కాకినాడ) : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పార్లమెంట్ స్థానానికి వికలాంగుల తరఫున అభ్యర్థిని నిలబెడతామని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర రావు తెలిపారు. బుధవారం కాకినాడ వచ్చిన ఆయన జెడ్పీ గెస్ట్హౌస్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు వికలాంగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచారన్నారు. వైకల్యాన్ని బట్టి పింఛన్ ఇవ్వడం అనుచితమన్నారు. వికలాంగులందరికీ ఒకేలా రూ.1500 పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు ఖండవిల్లి భరత్కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల రత్నం, జిల్లా ప్రధాన కార్యదర్శి జవ్వాది సూరి బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు కముజు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
 


