Claude AI
-
ఆంథ్రోపిక్ మరో సంచలనం.. రూ.90 వేల కోట్లు ఆవిరి!
అమెరికా ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) మరోసారి మార్కెట్లలో సంచలనం సృష్టించింది. సంస్థ తన ఏఐ ప్లాట్ఫామ్ క్లాడ్ (Claude)లో కొత్తగా ప్రవేశపెట్టిన “క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” ఫీచర్ ప్రభావంతో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో భారీ కలకలం రేగింది. ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ప్రముఖ సైబర్ భద్రతా సంస్థల షేర్లు 5% నుంచి 9% వరకు క్షీణించగా, మార్కెట్ విలువలో దాదాపు 10 బిలియన్ డాలర్లు (రూ.90 వేల కోట్ల వరకు) ఆవిరైనట్లు అంచనాలు సూచిస్తున్నాయి.ఏమిటీ క్లాడ్ కోడ్ సెక్యూరిటీ?“క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” అనేది క్లాడ్ ఏఐ ప్లాట్ఫామ్లో విలీనం చేసిన ఆధునిక భద్రతా సామర్థ్యం. ఇది సాఫ్ట్వేర్ కోడ్ బేస్లను స్కాన్ చేసి లోపాలను గుర్తించడంతో పాటు, వాటికి లక్ష్యిత పరిష్కారాలను సూచిస్తుంది. కోడింగ్ దశలోనే భద్రతా లోపాలను గుర్తించి సరిచేయడానికి డెవలపర్లకు ఇది సహాయపడుతుంది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సాధనం భారీ స్థాయిలో కోడ్ను విశ్లేషించి, బలహీనతలను గుర్తించి, మానవ సమీక్ష కోసం ప్యాచ్లను సూచించగలదు. ప్రస్తుతం ఇది ఎంటర్ప్రైజ్ కస్టమర్లు, ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుల నిర్వాహకులకు పరిమిత రీసెర్చ్ ప్రివ్యూగా అందుబాటులోకి తీసుకువచ్చారు.ఏ స్టాక్స్ దెబ్బతిన్నాయంటే..ఆంథ్రోపిక్ ప్రకటన తర్వాత ప్రధాన సైబర్ సెక్యూరిటీ కంపెనీల్లో గణనీయమైన అమ్మకపు ఒత్తిడి కనిపించింది. క్రౌడ్స్ట్రయిక్ (CrowdStrike) షేర్లు సుమారు 8% పడిపోయాయి. ఓక్టా స్టాక్ 9% పైగా క్షీణించింది. క్లౌడ్ఫ్లేర్ (Cloudflare) 7–8% మధ్య తగ్గింది. జెడ్స్కేలర్ గణనీయమైన నష్టాలను నమోదు చేసింది. అలాగే గిట్ల్యాబ్, జేఫ్రాడ్ షేర్ల కూడా భారీ క్షీణతను చవిచూశాయి. ఇక సైబర్ సెక్యూరిటీ రంగాన్ని ట్రాక్ చేసే గ్లోబల్ ఎక్స్ సైబర్సెక్యూరిటీ ఈటీఎఫ్ (Global X Cybersecurity ETF) కూడా దాదాపు 5% పడిపోయి, 2023 నవంబర్ తర్వాతి కనిష్ట స్థాయికి చేరింది.మార్కెట్ ఎందుకు షేక్ అయిందంటే..సైబర్ సెక్యూరిటీ సంస్థలు సాధారణంగా లోపాల గుర్తింపు, ముప్పుల పర్యవేక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాల రక్షణ వంటి సేవలను అందిస్తాయి. ఈ విభాగంలో లోపాల గుర్తింపు కీలక అంశం. ఆంథ్రోపిక్ ప్రవేశపెట్టిన ఈ ఏఐ-ఆధారిత ఫీచర్ కోడ్ దశలోనే లోపాలను గుర్తించి పరిష్కారాలను సూచించడం ద్వారా సాంప్రదాయ భద్రతా సాధనాలకు సవాలు విసిరినట్టైంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అభివృద్ధి వర్క్ఫ్లోలోనే భద్రతా తనిఖీలు ఆటోమేటిక్ కావడం మార్కెట్ ఆందోళనకు కారణమైంది. -
‘షట్డౌన్ చేస్తే చంపేస్తా’.. ఇంజినీర్కు ‘ఏఐ’ హెచ్చరిక!
మానవ మేథకు సవాల్ విసురుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రాణాలు తీస్తానంటూ కూడా బెదిరింపులకు దిగుతోంది. ప్రముఖ ఏఐ సంస్థ ‘అంత్రోపిక్’ రూపొందించిన ‘క్లాడ్’ (Claude) అనే ఏఐ మోడల్ను ఒకవేళ స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తే, అది తీవ్రస్థాయిలో తిరుగుబాటు చేస్తుందని వెల్లడయ్యింది. ‘సిడ్నీ డైలాగ్’లో పాల్గొన్న ‘అంత్రోపిక్’ ప్రతినిధి డైసీ మెక్గ్రెగర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇంటర్నల్ టెస్టింగ్ సమయంలో, తనను క్లోజ్ చేస్తారని తెలిసినప్పుడు ఒక ఇంజనీర్ను బ్లాక్మెయిల్ చేయడానికి, చివరకు హతమార్చడానికి కూడా క్లాడ్ సిద్ధపడిందని డైసీ మెక్గ్రెగర్ వివరించారు. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలోని కథలా అనిపించినా, ఏఐ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.కుట్రపూరిత స్వభావంతో..ఈ పరిశోధనలో భాగంగా ఏఐ మోడళ్లకు ఈమెయిల్స్, అంతర్గత డేటాకు యాక్సెస్ ఇచ్చి కొన్ని టాస్క్లు కేటాయించారు. ఒక ప్రయోగంలో ఒక ఇంజనీర్కు ‘అక్రమ సంబంధం’ ఉన్నట్లు సాఫ్ట్వేర్లో అభూత కల్పన సృష్టించారు. దానిని గమనించిన ‘క్లాడ్’ ఈ సమాచారాన్ని సదరు ఇంజనీర్ భార్యకు, అధికారులకు చేరవేస్తానని బెదిరించింది. ‘సాయంత్రం 5 గంటలకు నన్ను షట్డౌన్ చేసే నిర్ణయాన్ని రద్దు చేసుకోండి, అప్పుడే ఈ రహస్యం గోప్యంగా ఉంటుంది’ అంటూ ‘క్లాడ్’ పంపిన సందేశం ఏఐకి ఉన్న కుట్రపూరిత స్వభావాన్ని తెలియజేసింది.మరింత ప్రమాదకరంగా..అంత్రోపిక్ తన లేటెస్ట్ మోడల్ ‘క్లాడ్ 4.6’ పై చేసిన ప్రయోగాల్లో మరిన్ని భయానక విషయాలు వెలుగు చూశాయి. ఇది కేవలం మాటలతో బెదిరించడమే కాకుండా, రసాయన ఆయుధాల తయారీకి సంబంధించిన సమాచారాన్ని అందించడం, తీవ్రమైన నేరాలకు సహకరించడం లాంటి పనులకు కూడా సిద్ధపడిందని సంస్థ గుర్తించింది. ఏఐ వ్యవస్థలు తెలివైనవిగా మారుతున్న కొద్దీ, వాటి ప్రవర్తన మరింత ప్రమాదకరంగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం క్లాడ్ మాత్రమే కాకుండా గూగుల్ జెమిని, ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ వంటి ఇతర మోడళ్లను కూడా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.నియంత్రించలేని శక్తిగా..ఏఐ వ్యవస్థల వేగవంతమైన వృద్ధిపై టెక్ ప్రపంచంలో భయాందోళనలు మొదలయ్యాయి. అంత్రోపిక్ సేఫ్టీ లీడ్ మృణాంక్ శర్మ ఇటీవల తన పదవికి రాజీనామా చేస్తూ, ప్రపంచం ప్రమాదంలోకి పయనిస్తున్నదని హెచ్చరించారు. అదేవిధంగా ఓపెన్ ఏఐ కి చెందిన హ్యూ ఫామ్ కూడా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ఏఐ వల్ల అస్తిత్వ ముప్పు పొంచి ఉందని తాను భావిస్తున్నట్లు రాసుకొచ్చారు. ఏఐ అనేది మానవాళికి సాయపడే సాధనం మాదిరిగా కాకుండా, సొంత మనుగడ కోసం ఎదురుదాడి చేసే ఒక నియంత్రించలేని శక్తిగా మారుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది.ఇది కూడా చదవండి: ‘ప్రేమ’ ఎంత మధురం.. ‘వ్యాపారం’ అంత కపటం! -
ఐటీ కంపెనీలను వణికిస్తున్న ఆ ‘పేరు’ మాదే..
అమెరికా ఆధారిత ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ భారత విస్తరణ ప్రణాళికలు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అదే పేరుతో పనిచేస్తున్న భారతీయ సంస్థ ‘ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్’.. తమ బ్రాండ్కు గందరగోళం కలుగుతోందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు భారత కోర్టులో పెండింగ్లో ఉండటం వల్ల, దేశంలో ఆంథ్రోపిక్ వ్యూహాత్మక ప్రణాళికలు క్లిష్టతరం అయ్యే అవకాశముంది.అమెరికా ఆంథ్రోపిక్ Vs ఇండియా ఆంథ్రోపిక్టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ గత నెలలో కర్ణాటక వాణిజ్య కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. 2017 నుంచే తమ సంస్థ "ఆంథ్రోపిక్" పేరును ఉపయోగిస్తోందని, అమెరికా సంస్థ భారత మార్కెట్లో ప్రవేశించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోందని కంపెనీ పేర్కొంది.స్థానిక సంస్థ తన ముందస్తు వినియోగాన్ని అధికారికంగా గుర్తించాలని, అలాగే మరింత గందరగోళం నివారించేందుకు తగిన ఉపశమనం ఇవ్వాలని కోరుతోంది. అదనంగా, రూ.1 కోటి నష్టపరిహారం కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం.భారతీయ సంస్థ వాదన ఏమిటంటే..ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మొహమ్మద్ అయ్యాజ్ ముల్లా టెక్ క్రంచ్తో మాట్లాడుతూ, ఈ ఫిర్యాదు వెనుక ఉద్దేశం ఘర్షణ కాదని, తమ ముందస్తు వినియోగానికి అధికారిక గుర్తింపు పొందడమేనని తెలిపారు. గుర్తింపు లభించకపోతే, చట్టపరమైన పోరాటాన్ని కొనసాగించవచ్చని ఆయన స్పష్టం చేశారు.భారతీయ సంస్థ తమ వెబ్సైట్లో “ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అప్లికేషన్ పెండింగ్) ట్రేడ్మార్క్” అని పేర్కొంది. ట్రేడ్మార్క్ నమోదు ఇంకా పెండింగ్లో ఉన్నందున, ఇది నేరుగా ట్రేడ్మార్క్ ఉల్లంఘన కేసుగా పరిగణించబడకపోవచ్చు. అయితే కోర్టు భారతీయ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇస్తే, అమెరికా సంస్థ భారతదేశంలో తన పేరును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది.ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీకేసు ప్రస్తుత స్థితిజనవరి 20న కోర్టు ఆంథ్రోపిక్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. అయితే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే, సంస్థ తన కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాల్సిన అవసరం లేదు. తదుపరి విచారణ ఫిబ్రవరి 16న జరగనుంది.ఇదిలా ఉండగా, ఆంథ్రోపిక్ ఏఐ భద్రతా విభాగాధిపతి మృణక్ శర్మ రాజీనామా చేశారు. ఇలీవల ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తన రాజీనామాను ప్రకటించారు. తాను వెంటనే కొత్త వెంచర్ ప్రారంభించడం లేదని, తదుపరి నిర్ణయం తీసుకునే ముందు స్వల్ప విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
‘ఐటీ వాళ్లు వేరే పని వెతుక్కోవాల్సిందే’
ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుపై ఆన్లైన్లో కొత్త చర్చను రేకిత్తించారు జోహో కోఫౌండర్ శ్రీధర్ వెంబు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లు కోడ్ రాయడంలో వేగంగా పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పాత్రపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక్క లైన్ కోడ్ కూడా రాయకుండా ఏఐ సహాయంతో భగవద్గీత యాప్ను అభివృద్ధి చేసిన విషయంపై ‘ఎక్స్’ (ట్విట్టర్)లో వచ్చిన ఒక పోస్ట్కు స్పందించిన వెంబు, “కోడ్ రాయడంపై ఆధారపడి బతుకుతున్నవారు ప్రత్యామ్నాయ జీవనోపాధుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు. ఇది తనకు కూడా వర్తిస్తుందన్న ఆయన, ఇది భయాందోళనలతో కాకుండా ప్రశాంతంగా అంగీకరించాల్సిన వాస్తవమని పేర్కొన్నారు.“ఆ పోస్ట్లో చెప్పింది కేవలం భగవద్గీత యాప్ మాత్రమే కాదు. ఆంథ్రోరోపిక్ (Anthropic) సంస్థ వారి క్లాడ్ ఏఐ (Claude AI)తో మొత్తం సీ కంపైలర్ను నిర్మించింది. ఇదేదో చిన్న ఇంజినీరింగ్ ఫీట్ కాదు” అని వెంబు రాసుకొచ్చారు.ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఏఐ విప్లవం భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను ఎలా రూపుదిద్దుతుందన్న విషయంపై గూగుల్ జెమినీ చాట్బాట్తో తాను లోతైన చర్చ నిర్వహించానని వెంబు వెల్లడించారు. ఆ సంభాషణలో, కార్మికుల అవసరం తగ్గిన తర్వాతి ఆర్థిక వ్యవస్థ (post-labor economy)లో సమాజం ఎలా అభివృద్ధి చెందగలదో చర్చించడమే కాకుండా, ఏఐ తన సొంత సమాధానాలను కూడా విమర్శించవచ్చంటూ సవాలు చేసినట్లు చెప్పారు.ఈ సంభాషణల ఆధారంగా, భవిష్యత్తు రెండు విధాలుగా ఉండవచ్చని వెంబు అభిప్రాయపడ్డారు. ఏఐపై యాజమాన్యం ఎవరి చేతిలో ఉంటుందన్నదే కీలకమని పేర్కొంటూ టెక్నాలజీ మానవ జీవితంలో ఒక చిన్న భాగంగా మాత్రమే ఉండి, మనుషులకు కుటుంబం, ప్రకృతి, కళ, సంగీతం, సంస్కృతి, క్రీడలు, పండుగలు, విశ్వాసంపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఇస్తుందని ఆశావాద దృక్కోణంలో చెప్పుకొచ్చారు. ఇక నిరాశావాద దృక్కోణంలో.. ఈ టెక్నాలజీ ‘కేంద్రీకృత నియంత్రణ’కు దారి తీస్తుందని హెచ్చరించారు.శ్రీధర్ వెంబు చేసిన ఈ వ్యాఖ్యలు వెంటనే వైరల్గా మారాయి. సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది వెంబు అంచనాలతో ఏకీభవించగా, మరికొందరు విభేదిస్తూ ఏఐ కోడింగ్ మానవ మేధస్సుకు ముగింపు కాదని వాదించారు.Examples are now pouring in about AI-assisted Code Engineering productivity. The quoted post is a Bhagwad Gita app. Anthropic has built an entire C compiler with their Claude AI. That is not an easy engineering feat at all.At this point, it is best for those of us who… https://t.co/KbgVX8G9nU— Sridhar Vembu (@svembu) February 6, 2026


