Capital region farmers
-
రాజధానిలో ఇతర ప్రాంతాల వారికి స్థలాలివ్వడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్లస్థలాలు ఇవ్వడానికి వీల్లేదని రాజధాని రైతులు బుధవారం హైకోర్టుకు నివేదించారు. రాజధాని ప్రాంతంలో ఇతరులకు ఇళ్లస్థలాలు ఇచ్చి ఆ ప్రాంతాన్ని మురికివాడగా చేసి, తద్వారా రాజధానిని అడ్డుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని రైతుల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు చెప్పారు. ఇళ్లస్థలాలు ఇస్తే తమప్రాంత ప్రజలకే ఇవ్వాలన్నారు. ల్యాండ్పూలింగ్ కింద రైతులిచ్చిన భూముల్లో ఇతరులకు ఇళ్లస్థలాలు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు. చట్ట నిబంధనల ప్రకారం రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను ప్లాట్లుగా అభివృద్ధి చేసి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, ఆ ప్లాట్లను తిరిగి రైతులకు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతుల భూములను రాజధాని అభివృద్ధి కోసమే ఉపయోగించాలి తప్ప ఇతర అవసరాలకు వినియోగించరాదని చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఇతరులకు ఇళ్లస్థలాలు ఇవ్వడమంటే మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా వ్యవహరించడమేనని, ఇలా చేసే అధికారం సీఆర్డీఏకు, ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టం విషయంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. ఇతర ప్రాంతాల వారికి ఇళ్లస్థలాలు కేటాయించకుండా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. రైతుల తరఫున ఆదినారాయణరావు వాదనలను పూర్తిచేయడంతో ప్రభుత్వ వాదనల నిమిత్తం విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని సవరించ డాన్ని సవాలు చేస్తూ రాజధాని రైతుపరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై బుధవారం జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం విచారించింది. ఆ వ్యాజ్యాలన్నీ నిరర్థకం.. రాజధాని ప్రాంతంలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్లస్థలాల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం 2020లో జారీచేసిన జీవో 107ను సవాలు చేస్తూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్లస్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం సవరణ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో జీవో 107ను సవాలు చేస్తూ రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలు నిరర్థకం అవుతాయంటూ ప్రభుత్వం ఓ మెమో దాఖలు చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి బుధవారం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రైతుల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు ఈ మెమోను వ్యతిరేకించారు. తమ వ్యాజ్యాలు నిరర్థకం కావని, అవి మనుగడలోనే ఉంటాయని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు, ఆ వ్యాజ్యాలు ఏ విధంగా మనుగడలో ఉంటాయో తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదినారాయణరావుకు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
రైతుల్ని వేధిస్తున్న చంద్రబాబు సర్కారు
-
బలవంతపు భూసేకరణపై రాజధాని రైతుల ఆందోళన
విజయవాడ : భూసేకరణ చట్టం అమలుపై రాజధాని ప్రాంత గ్రామాల రైతులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటనపై రాజధాని ప్రాంత రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపోరాటం ద్వారా భూ సేకరణను అడ్డుకుంటామని రైతులు అంటున్నారు. బలవంతంగా భూసేకరణ చేస్తే జాతీయ స్థాయిలో మరోసారి భూ పోరాటం చేస్తామని ఆ రైతులు సూచించారు. ఏక పక్షంగా రైతుల నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయంపై జాతీయ నేతలను కలిసేందుకు అమరావతి రైతులు సిద్ధమవుతున్నారు. అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కునేందుకు యత్నిస్తున్నారంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించేందుకు దళితులు నిర్ణయించుకున్నారు. భూ సేకరణ చట్టం అమలు నిర్ణయంపై రాజధాని ప్రాంత గ్రామాల్లో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. -
భూబకాసురుడిగా చంద్రబాబు పాలన
రాజధాని గుర్తింపు, భూసంబంధ, నిర్మాణ అంశాలు అన్నీ రహస్యంగా, తన సొంత వ్యవహారంలా చేస్తున్న చంద్రబాబు పాలనలో రాష్ట్ర రైతాంగం అనుభవిస్తున్న కష్టాలు వర్ణనాతీతం. బాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతాంగం కంట కన్నీరే కారుతోంది. రాష్ట్ర రైతాంగం నుంచి లక్షల ఎకరాల భూమిని (సుమారు 15 లక్షలు) సేకరించి భూ నిధిని (ల్యాండ్ బ్యాంక్) సృష్టించుకోవాలనీ, ఈ భూమి నే ప్రధాన పెట్టుబడిగా మలచి ఆదాయాన్ని సమకూర్చుకో వాలనీ సీఎం చంద్రబాబు నిర్ణ యించుకున్నట్లు స్పష్టమౌ తోంది. బహుళ పంటలు పండే భూములను ఇష్టం వచ్చి నట్లు పారిశ్రామిక వర్గాలకు అనుకూలంగా అవసరానికి మించి, అవసరం లేనిచోట, ఇష్టానుసారం సేకరించ డమే ధ్యేయంగా సాగితే మాత్రం చంద్రబాబు వ్యాపార విజన్కు మొదట బలయ్యేది రైతులు, రైతు కూలీలు, ఆ ప్రాంత ప్రజానీకమేనని వేరే చెప్పనవసరం లేదు. రాజధాని రైతుల నుంచి సేకరిస్తున్న 33 వేల ఎకరా లతోపాటు మరో 55 వేల ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేయమని కేంద్రాన్ని కోరినట్లు, త్వరలోనే డీనోటిఫై అవుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాజ ధాని ప్రాంతంలో మొత్తం 88 వేల ఎకరాలతో ప్రభు త్వం తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని సీఎం ప్రకటన తేల్చింది. ముందు రాజధాని ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూమి (అటవీ భూమితోసహా) ఎంత ఉందో గుర్తించి దానిలో నిర్మాణ పనులు చేపట్టాలని మరీ అవసరమైతే అప్పుడు రైతు లను ఒప్పించి సేకరించవచ్చని ఆ నాడే సూచించాం. రాజధాని గుర్తింపు, భూసంబంధ, నిర్మాణ అం శాలు అన్నీ రహస్యంగా తన సొంత వ్యవహారంలా చేస్తున్న చంద్రబాబు మా మాటలను పెద్దగా పట్టించుకో లేదు. ఇప్పుడిప్పుడే రహస్యాలు బహిరంగమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ భూదాహానికి రైతాంగం ఎంతగా భయకంపితమౌతుందో, ఏవిధంగా బలవన్మ రణాలకు పాల్పడుతున్నదో మచి లీపట్నం, భోగాపురం ప్రాంతా ల్లోకి వెళితే తెలుస్తుంది. మచిలీ పట్నం పోర్టు నిర్మాణానికి కాం గ్రెస్ ప్రభుత్వం 5,324 ఎకరా లను సేకరించేందుకు జీవో ఇచ్చింది. దీనిలో సుమారు మూడు వేల ఎకరాలు ప్రభుత్వ, దేవాదాయ, అసైన్డ్ భూములు కాగా మిగతా రెండు వేల ఎక రాలు రైతుల వద్ద నుంచి సేకరిం చాల్సింది. కానీ అప్పుడు ప్రతి పక్షంలో ఉన్న తెలుగుదేశం నేతలు రోడ్లెక్కారు. పోర్టుకు వెయ్యి ఎకరాలు సరిపోతాయన్నారు. రైతుల భూములు సేకరిస్తే ఊరుకోమన్నారు. కానీ అధికారంలోకి రాగానే భూబకాసురుడు నిద్రలేచినట్లు మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి, పోర్టు ఆధారిత పరిశ్రమల కారిడార్కు కలిపి 14,500 ఎకరాలు సేకరించాలని నోటిఫికేషన్ జారీ చేశారు. అదనంగా మరో 20 వేల ఎకరాలు సేకరిం చనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో బందరు ప్రాంత రైతుల గుండెల మీద పిడుగు పడినట్లయింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కోసం సుమారు 15,500 ఎక రాలు సేకరిస్తున్నామని చెప్పడంతో కొబ్బరి, జీడిమా మిడి పంటల ఫలసాయం మీద ఆధారపడి ఏడాది పొడ వునా భరోసాతో జీవిస్తున్న రైతాంగం, రైతు కూలీలు, ఇతర ప్రజానీకం ఒక్కసారిగా ఆందోళనలోకి వెళ్లింది. విశాఖలో ఉన్న ప్రస్తుత ఎయిర్పోర్టుకు సమీపంలో వం దల ఎకరాల ఖాళీ భూమి ఉందని దాన్ని వినియోగించ కుండా తమ భూముల్లోకి ఎందుకు వస్తున్నారని భోగా పురం ప్రజలు ఆవేదనతో ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ఇటీవల సమారు ఆరు పెళ్లిళ్లు నిలిచిపోయాయని మహిళలు కన్నీటితో వాపోయారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం గూడెపు వలసలో మగటపల్లి పెదకృష్ణమూర్తి చెరు వులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎ.రావివలసకు చెందిన వెంపాడ రామసూరి కొద్ది రోజులుగా ఆందోళన చెందుతూ గుండె పోటుతో మృతి చెందాడు. ఇదే విధంగా కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గంలో వ్యవసాయాధారిత పరి శ్రమల కోసం వ్యవసాయ భూములను కేటాయిస్తూ నిర్ణ యం చేశారు. కుప్పం నియోజక వర్గంలో ఎయిర్పోర్టుకంటూ పచ్చటి పొలాలను లాక్కునేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఇదీ బాబు పాలనలో రాష్ట్ర రైతాంగం అనుభవిస్తున్న కష్టాలు. బాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతాంగం కంట కన్నీరే కారుతోంది. రైతుకు మృత్యుఘోష తప్పడం లేదు. నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు భూమి కేటా యింపులకు సంబంధించి ఏ అవసరానికి ఎంత భూమి కేటాయించాలో విచక్షణతో పారదర్శకంగా ఉండాలని ఒక పాలసీని తీసుకువచ్చాం. రైతుకు రక్షణ కవచంగా ఉన్న భూసేకరణ చట్టం ప్రకారమయితే చంద్రబాబు ప్రభుత్వం లక్షల ఎకరాల వ్యవసాయ, పంట భూము లను రైతుల నుంచి సేకరించలేడు. కనుకనే భూ సమీ కరణ పల్లవి అందుకుంటున్నాడు. బాబు భూసమీకరణ ఉచ్చులో చిక్కుకోకుండా రైతులంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా భూసేకరణ ప్రకటించిన ప్రాంత రైతాంగానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రైతు సంఘ నాయకులు, మేధావులు, పౌర, ప్రజాస్వామిక సంస్థలు, ప్రజాసం ఘాలు రైతుకు అండగా, రైతు పోరా టానికి దన్నుగా నిలవాల్సిన సమయమిది. (వ్యాసకర్త: అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. మొబైల్: 8297199999 - డా॥ఎన్.రఘువీరారెడ్డి -
జూలై 10 తర్వాత భూ సేక'రణమే': ఏపీ మంత్రి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూసమీకరణను జులై 10 వరకు చేపడుతామని రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతులు వేసిన కేసులన్నీ కోర్టు కొట్టేసిందని, ఆ రైతులంతా భూసమీకరణ ప్యాకేజీకి ఇష్టపడితే భూములు తీసుకుంటామని నారాయణ వెల్లడించారు. లేనిపక్షంలో వచ్చే నెల 10 తర్వాత భూ సేకరణ చట్టాన్ని వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. 9.3 ఫారాలు ఇచ్చిన రైతులెవరూ కొత్తగా పంటలు వేయొద్దని కూడా రైతులకు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్వం మాట వినకుండా పంటలు వేస్తే ఆ రైతులు ఇబ్బందలు ఎదుర్కొంటారని మంత్రి నారాయణ అన్నారు. -
ఔను...ప్రైవేటు రాజధానే
-
’ప్రైవేట్’ రాజధాని
-
‘ప్రైవేట్’ రాజధాని
* రైతుల భూములు 99 ఏళ్లు ప్రైవేట్ పరం * రాజధానిలో ప్రభుత్వం మాయ.. జీవోను వెబ్సైట్లో ఉంచని వైనం * భూములపై నిధులు సమకూర్చుకునే వెసులుబాటు * సీసీడీఎంసీ ద్వారా ప్రైవేట్ సంస్థలకు భూములు.. లీజు వసూలు బాధ్యత వాటిదే * లీజు ఒప్పందాలు చేసుకుని యూజర్ చార్జీలు, పట్టణ నిర్వహణ చార్జీల వసూలు * రాజధాని ప్రాంత సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తుంది సాక్షి, హైదరాబాద్: రాజధాని కోసం రైతుల నుంచి సమీకరించిన వేలాది ఎకరాల భూములను ప్రైవేట్ కంపెనీలకు జీవిత కాలంపాటు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని కోసం ఇటీవలే కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీ (సీసీడీఎంసీ)ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. దాని ద్వారా అమరావతిలో ప్రైవేటు కంపెనీలకు ద్వారాలు తెరిచింది. సీసీడీఎంసీ ద్వారా అమరావతిలో చేపట్టబోయే ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. రాజధానిలో చేపట్టే ప్రాజెక్టుల్లో పెట్టుబడి భాగస్వామికి లేదా ప్రైవేటు పార్టీలకు భూములను 99 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఈ నెల 2న దీనికి సంబంధించి ఉత్తర్వులు (జీవోఎంస్ నంబర్ 110) జారీ చేసింది. అయితే ప్రైవేటు సంస్థలకు పెద్దపీట వేసిన విషయం బయటపడకుండా, ఆ జీవోను వెబ్సైట్లో పెట్టకుండా రహస్యంగా ఉంచారు. 2 వ తేదీన జీవో నంబర్ మాత్రమే పెట్టి వివరాలను ఖాళీగా (బ్లాంక్) ఉంచారు. అయితే ఇందులో పొందుపరిచిన విషయాలు పరిశీలిస్తే.. రాజధానిలో చేపట్టబోయే వివిధ ప్రాజెక్టుల విషయంలో ప్రైవేటు సంస్థలకు లీజు పద్ధతిలో భూములు అప్పగించడానికి ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాజధానిలో అభివృద్ధి చేసిన ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ), లేదా భూమిని లేదా ఉపాధి కల్పన పెట్టుబడి భాగస్వామికి లేదా ప్రైవేట్ పార్టీలకు 99 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. జీవోలో ఏముంది.. భూమిని 99 సంవత్సరాల పాటు లీజుకివ్వడం అంటే దాదాపు రెండు తరాల పాటు ప్రైవేట్ పార్టీలకు స్వాధీనం చేయడమేనని స్పష్టమవుతోంది. లీజు పొందిన పార్టీలు ఆ భూమి విలువ ఆధారంగా మార్కెట్ నుంచి ఆర్థిక వనరులను సమీకరించుకునే వెసులుబాటు కల్పించారు. 2013 కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసిన సీసీడీఎంసీ విధులు, అధికారాలను జీవో నిర్ధారించారు. ఏడాది వారీగా లీజును వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేస్తుంది. 99 సంవత్సరాలకు లీజుకు ఇస్తూ ఒప్పందాలు చేసుకుంటుంది. నూతన రాజధానిలో రవాణా, విద్యుత్, మంచినీటి సరఫరా, వ్యర్థ పదార్థాల నిర్వహణ, సమాచార పరిజ్ఞానంతో పాటు ఉమ్మడి ప్రాంతంలో ఇతర మౌలిక వసతుల పనులను నేరుగాగానీ పీపీపీ విధానంలోగానీ అప్పగించవచ్చునని జీవోలో స్పష్టం చేశారు. అది కూడా ‘వయబులిటీ స్మార్ట్ సిటీ ప్రిన్సిపల్స్’ మేరకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. అంటే నామినేషన్ విధానంలో ఈ మౌలిక వసతుల పనులను అప్పగిస్తారని స్పష్టమవుతోంది. అలాగే నూతన రాజధానిలో వైద్య సేవలు, స్పోర్ట్స్, విద్య, వినోదం వంటి సామాజిక మౌలిక సదుపాయాలను వివిధ భాగస్వాముల ద్వారా చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఆర్డీఏ ఆమోదం పొందిన రాజధాని మాస్టర్ ప్లాన్ ఆధారంగా సీసీడీఎంసీ ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తుంది. తిరిగి ప్రణాళికను సీఆర్డీఏ ద్వారా ఆమోదం తీసుకుని కార్యాచరణను ప్రారంభిస్తుంది. నూతన రాజధానిలో అన్ని రకాల సేవలకు సంబంధించి డిజైన్, అభివృద్ధి, అమలు నిర్వహణ పనులను సీసీడీఎంసీ చేపడుతుంది. భవన నిర్మాణాల ప్రణాళికలను ఇతర మౌలిక వసతుల కల్పనలను పరిశీలించి సిఫార్సు చేసే అధికారం సీసీడీఎంసీకి ఇచ్చారు. ప్రైవేట్ డెవలపర్స్ నుంచి డెవలప్మెంట్ చార్జీలను సీసీడీఎంసీ వసూలు చేస్తుంది. సీఆర్డీఏ నిర్ధారించిన మేరకు వినియోగదారుల నుంచి యూజర్ చార్జీలు, టారిఫ్ను సీసీడీఎంసీ వసూలు చేయనుంది. అలాగే రాజధాని పట్టణ నిర్వహణ చార్జీలను కూడా వసూలు చేస్తారు. రాజధాని సిటీ అభివృద్ధిలో భాగంగా ఉపాధి కల్పన పెట్టుబడి భాగస్వామితో పాటు ఇతర ప్రైవేట్ ఏజెన్సీలను సీసీడీఎంసీ ఎంపిక చేయనుంది. ఇక కీలకమైన జీవితకాల లీజు విషయాన్ని జీవో పాయింట్లలో కింద ఉదహరించడం కొసమెరుపు.. జీవో 110 రాజధాని కోసం రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు 99 ఏళ్లు లీజుపై ధారాదత్తం ఏమవుతుంది? 99 ఏళ్ల పాటు భూములు లీజుకిస్తే రెండు తరాల పాటు ప్రైవేట్ కంపెనీలకు హక్కులు కల్పించటమే. భూములు పొందిన సంస్థలు తనఖా పెట్టుకుని ఆర్థిక వనరులు సమీకరించుకోవచ్చు. రాజధానిలో మౌలిక వసతుల కల్పనను నామినేషన్పై అప్పగించనుంది. అంతా గోప్యం.. ఈనెల 2న ఇచ్చిన ఈ జీవోను వెబ్సైట్లో ఉంచకుండా రహస్యంగా వ్యవహరించింది. జీవో నంబర్ మాత్రమే పేర్కొంటూ వివరాలను ఖాళీగా వదిలేసింది. ప్రైవేట్ సంస్థలకు భూములు కట్టబెట్టేందుకు దారులు తెరిచింది. యూజర్ చార్జీలు కట్టాల్సిందే - రవాణా విద్యుత్, మంచినీటి సరఫరా ఇతర మౌళిక వసతుల పనులను నేరుగా గానీ, పీపీపీ విధానం ద్వారా గానీ అప్పగించవచ్చు - వినియోగదారుల నుంచి యూజర్ చార్జీలను అలాగే పట్టణ నిర్వహణ చార్జీలను సీసీడీఎంసీ వసూలు చేయనుంది. -
పరిహార భూములు ఎక్కడిస్తారు?
మంత్రి నారాయణను నిలదీసిన ఎర్రబాలెం రైతులు మంగళగిరి: ‘మా భూములకు బదులుగా ప్రభుత్వమిచ్చే భూములు ఎక్కడ కేటాయిస్తారు?. మా గ్రామ రైతులందరికీ ఒకే చోట కేటాయిస్తారా? లేక ఒక్కొక్కరికి వేర్వేరు చోట్ల ఇస్తారా?. ఈ విషయాల్ని అగ్రిమెంట్లో ఎందుకు చేర్చలేదు?. అగ్రిమెంట్ చేసుకుని.. కౌలు చెక్కు తీసుకున్న తర్వాత రైతుకు ఎలాంటి హక్కు లేదంటే మా పరిస్థితేంటి?.’ అని రైతులు రాష్ట్ర మంత్రి పి.నారాయణ వద్ద ప్రశ్నల వర్షం కురిపించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం రైతులకు కౌలు చెక్కులు అందజేసిన మంత్రి.. భూముల్ని చదును చేసేందుకు పొలాల్లోకి చేరుకున్నారు. దీంతో అక్కడికి వచ్చిన రైతులు తమ ప్రశ్నలతో మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేశారు. వారి ప్రశ్నలకు నీళ్లు నమిలిన మంత్రి.. ‘మమ్మల్ని, చంద్రబాబును నమ్మండి. రైతులకు అన్యాయం చేయం’ అని అన్నారు. ‘రుణమాఫీ వ్యవహారంతో సీఎం చంద్రబాబుపై నమ్మకం పోయింది. ఇప్పుడెలా నమ్మాలి’ అని రైతులు ప్రశ్నించడంతో మంత్రి వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. నా భూమి దగ్గరకొస్తే ఆత్మహత్య చేసుకుంటా: రైతు రాఘవరావు భూసమీకరణ గడువు చివరి రోజుల్లో.. మంత్రి నారాయణ నాటకాలాడి రైతులను భయపెట్టినందునే అంగీకారపత్రాలు ఇచ్చామని ఎర్రబాలెం రైతు రాఘవరావు వెల్లడించారు. ఇప్పుడు కౌలు చెక్కులు, భూముల చదును పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. చదును పేరుతో తనభూమి వద్దకు వస్తే మానవబాంబుగా మారి ఆత్మహత్య చేసుకుంటాని హెచ్చరించారు. భూముల గురించి నారాయణకు ఏం తెలుసని ప్రశ్నించారు. స్కూళ్లలో పేద పిల్లల వద్ద ఫీజులు గుంజడం నేర్చుకుని.. అదే విద్యను పేద రైతులపై చూపిస్తున్నారని విమర్శించారు. ఫీజులు వసూలు చేయడంలో నారాయణ దిట్ట కనుకే.. భూములు లాక్కొస్తారని చంద్రబాబు ఆయనను రాజధాని గ్రామాల్లో తిప్పుతున్నారని ఆరోపించారు. -
భయంతోనే భూములు ఇచ్చాం
అన్నా హజారే మిత్ర బృందంతో రాజధాని రైతుల ఆవేదన తాడికొండ (గుంటూరు):తుళ్ళూరు రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి భయపడి భూములు ఇచ్చామని, రాజధాని ప్రాంత రైతులు జాతీయ ఐక్య కూటమి కన్వీనర్ పి.వి.రాజగోపాల్ ఎదుట వాపోయారు. రాజధాని ప్రాంతంలో రైతుల్లో నుంచి భూములు బలవంతంగా లాక్కొంటున్నారని తెలుసుకున్న అన్నహజారే మిత్ర బృందం అయిన రాజగోపాల్ బృందం రాజధాని గ్రామంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. తుళ్ళూరు మండలంలోని మందడం,తాళయపాలెం, ఉద్దడ్రాయనిపాలెం, లింగాయపాలెం, రాయపూడి గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలు, మనోభావాలు తెలుసుకుని రైతుల తరుపున పోరాడతామని రైతులకు భరోసా ఇచ్చారు. ఈసందర్భంగా లింగాయపాలెం గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ రైతులు బలవంతంగా భూములు ఇచ్చినట్లయితే వెనక్కు తీసుకోవచ్చని, ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకునేటటై్లతే తాము రైతుల తరుపున నిలబడి పోరాడతామని చెప్పారు. రాజధాని ప్రాంత సమస్యలను ఢిల్లీలో అన్నహజారే దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో మూడు పంటలు పండే భూములను రాజధాని నిర్మాణానికి తీసుకోవడం సరైంది కాదన్నారు. ఈ సందర్భంగా రాజధాని పర్యటన కమిటి నాయకులు లింగాయపాలెం గ్రామానికి చెందిన అనుమోలు గాంధీ మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన రాజధాని ప్రాంత రైతుల తరుపున ఢిల్లీలో నిర్వహించిన సేవా గ్రామ్ కార్యక్రమానికి వెళ్ళి రాజధాని ప్రాంత పరిస్థితిపై అన్నహాజరేకు వివరించినట్లు చెప్పారు. కొద్దిరోజుల్లో రాజధాని ప్రాంతంలో పర్యటించే అవకాశం ఉందన్నారు. ఈనెలాఖరు నుంచి అన్నహజారే 1100 కిలో మీటర్ల పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా రాజధాని ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా కొద్దిరోజుల్లో రాజధానిప్రాంతాన్ని సందర్శించడానికి మేధాపాట్కార్ కూడా రానున్నట్లు చెప్పారు. అనంతరం రాయపూడిలోని నిమ్మతోటలను పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఎంటీమ్ ప్రతినిధి బలిశెట్టి సత్యనారాయణ, విష్ణు, ప్రముఖ న్యాయవాది మల్లెల శేషగిరిరావు, చిట్టిబాబు, పలువురు నాయకులు, పాల్గొన్నారు. -
రెండో పంట.. రైతుల హక్కు: పార్థసారధి
హైదరాబాద్: త్వరలో వైఎస్ఆర్సీపీ రైతుహక్కు పరిరక్షణ కమిటీ ఏపీ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నట్టు వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను రెండో పంట వేయొద్దని ఏపీ ప్రభుత్వం చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రెండో పంట వేసుకునే రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని పార్థసారధి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నూతన రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రాంత రైతుల నుంచి భూములు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతుందుని ఆయన చెప్పారు. అమాయక రైతుల భూములు లాక్కుని ఏపీ రాజధాని నిర్మించాలనుకోవడం దారుణమన్నారు. రాజధానికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదని పార్థసారధి స్పష్టం చేశారు. అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కూడా రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని పార్థసారధి చెప్పారు. -
'సుధారాణి కుటుంబాన్ని బెదిరిస్తున్నారు'
హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) బిల్లును అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ సర్కార్ దురాగతాలకు పాల్పడుతుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. శనివారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు అభ్యంతర ఫారాలను ఇవ్వడానికి వెళ్తే గడువు ముగిసిపోయిందంటూ సర్కారు వేధింపులకు గురిచేస్తుందన్నారు. ఇందులో భాగంగానే రైతు బోయపాటి సుధారాణి ఇంటికి పోలీసులు, టీడీపీ నేతలు వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారన్నారు. సుధారాణి కుటుంబం వారి బెదిరింపులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని ఆయన తెలిపారు. అమాయక రైతులను పోలీసులు వేధిస్తున్నారని.. ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే తీవ్ర ఉద్యమం తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
'రైతులను భయపెడితే చూస్తూ ఊరుకోం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని నిర్మాణం కోసం రైతులనుంచి ఏపీ ప్రభుత్వం భూములు కోరిన నేపథ్యంలో విజయవాడలోని కృష్ణానదిలో రాజధాని ప్రాంత రైతులు శుక్రవారం వినూత్న నిరసనకు దిగారు. మోకళ్ల లోతు వరకూ నీళ్లలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో రైతుల ఇళ్లు తీసుకుంటామని, నోటిఫై చేసిన ప్రతి సెంట్ భూమిని తీసుకుంటామని సీఆర్డీఏ కమిషనర్ అంటున్నారని ఆర్కే చెప్పారు. రోజురోజుకీ రైతులను సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెండో పంట వేయొద్దని చెప్పే అధికారం సీఆర్డీఏ కమిషనర్కు ఎక్కడదంటూ ధ్వజమెత్తారు. ఆయన అధికారా? రాజకీయ నేతా? అంటూ ప్రశ్నించారు. రైతులను సీఆర్డీఏ కమిషనర్ భయపడితే తాము చూస్తూ ఊరుకోమంటూ ఆర్కే స్పష్టం చేశారు.