-
తెలుగు బాలుడి సాహసయాత్ర.. రోజుకు 150 కిలోమీటర్లు సైకిల్పై..
సాక్షి, న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలంటూ 10వ తరగతి పూర్తిచేసిన తెలుగు బాలుడు 15 ఏళ్ల ఉర్దనపల్లి ఆశిష్ చెన్నై నుంచి లద్దాఖ్ రాజధాని లేహ్ వరకు సైకిల్ మీద సాహసయాత్ర చేశాడు. వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఆశిష్ కుటుంబం వ్యాపారరీత్యా కొన్నేళ్ల కిందట చెన్నైలో స్థిరపడింది. సైక్లింగ్పై ఆసక్తి ఉన్న ఆశిష్ జూలైలో చెన్నై నుంచి సైకిల్పై బయలుదేరి 41 రోజుల్లోనే లేహ్కు చేరుకున్నాడు. సైకిల్యాత్రను పూర్తిచేసి తిరుగుప్రయాణంలో ఢిల్లీకి చేరుకున్న ఆశిష్ సహా అతడి కుటుంబసభ్యులు ఏపీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఆశిష్ మాట్లాడుతూ సైకిల్ యాత్రలో మైదాన ప్రాంతంలో రోజూ 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పాడు. చండీఘడ్ నుంచి పర్వత ప్రాంత ప్రయాణం మొదలయ్యాక ప్రతికూల వాతావరణం, వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడినా యాత్రను కొనసాగించినట్లు తెలిపాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలన్నదే తన కల అని పేర్కొన్నాడు. తనపై తల్లిదండ్రులెప్పుడూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. చెన్నై నుంచి లండన్కు సైకిల్యాత్ర చేయనున్నట్లు ఆశిష్ చెప్పాడు. (క్లిక్: 23 నిమిషాల్లో 2005 కిక్స్.. తైక్వాండోలో బాలిక ప్రతిభ) -
600 కి.మీ.. ఆకలి కడుపుతో!
హరియాణాలోని కర్నాల్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని తమ గ్రామానికి ఖాళీ కడుపులతో దాదాపు 600 కిలోమీటర్ల దూరం సైకిల్పై వెళ్లిన వలస కూలీల విషాద కథనమిది. ఉత్తర ప్రదేశ్లోని ఒక గ్రామానికి చెందిన శివం రాథోడ్, రామానంద్ రాథోడ్లు నిర్మాణ కార్మికులు. వారు కర్నాల్లో ఎనిమిది అంతస్తుల భవన నిర్మాణ ప్రాజెక్టులో కూలీలుగా మార్చి 19న చేరారు. రోజుకు రూ. 400 కూలీగా వారి ఊరి నుంచి పలువురు ఆ ప్రాజెక్టులో కూలీలుగా చేరారు. కూలీ తక్కువైనా.. వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి కొంత డబ్బు సంపాదించుకుని వారి స్వగ్రామానికి వెళ్లాలనేది వారి ఆలోచన. కానీ దురదృష్టం వారిని వెన్నాడింది. పనిలో చేరిన మూడు రోజులకే జనతా కర్ఫ్యూ. ఆ తరువాత లాక్డౌన్. దాంతో పనులు ఆగిపోయాయి. కొన్నాళ్లు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్ నిత్యావసరాల కోసం రోజుకు ఒక్కొక్కరికి రూ. 100 ఇచ్చేవాడు. కొన్ని రోజులు గడిచాక.. తన వల్ల కాదని చేతులెత్తేశాడు. ఏప్రిల్ 29న వీరుంటున్న తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వసతి వద్దకు వచ్చి.. తన ఆదాయం కూడా పడిపోయిందని, తానేం చేయలేనని చేతులెత్తి దండం పెట్టి, వెళ్లిపోయాడు. ఆ కూలీల పరిస్థితి అగమ్యగోచరమైంది. స్థానిక ప్రభుత్వం ఇచ్చే రేషన్.. స్థానికేతరులు కావడంతో వీరికి అందలేదు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఎలాంటి సాయం అందించలేదు. ఆ కాంట్రాక్టరే దయ దలిచి శివం, రామానంద్, మరో ఇద్దరికి కలిపి మూడు పాత సైకిళ్లను సమకూర్చాడు. వాటిపైననే వారు 600 కిమీల దూరంలోని తమ గ్రామానికి బయల్దేరారు. మే 2 నాటికి ఆగ్రా సమీపా నికి చేరుకున్నారు. అంత దూరం ఎండలో ఎలా సైకిల్పై వెళ్తున్నారన్న ప్రశ్నకు.. కొద్ది, కొద్ది దూరం తొక్కుతూ వెళ్తున్నామని చెప్పారు. మరి భోజనమెలా? అన్న ప్రశ్నకు.. అప్పట్నుంచి అన్నం తినలేదని, తాము దాటి వచ్చిన హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ల్లో హైవేపై పలు టోల్గేట్స్ ఉన్నా, ఎక్కడా, ఎలాంటి ఆహార సదుపాయాలు ఏర్పాటు చేయలేదని చెప్పారు. తామే కాకుండా, ఈ హైవేపై వందలాదిగా కూలీలు నడుస్తూ సొంతూళ్లకు వెళ్తున్నారని, వారు కూడా ఆకలితోటే ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఒక టోల్ గేట్ వద్ద మాత్రం ఒక పోలీస్ 2 డజన్ల అరటి పండ్లు, నమ్కీన్ ప్యాకెట్లు, బిస్కట్ ప్యాకెట్లు ఇచ్చాడని, వాటితోనే కడుపు నింపుకుంటున్నామని చెప్పారు. ఇంటివద్ద తనకు అమ్మ, చెల్లి ఉన్నారన్న శివం రాథోడ్.. ‘వారు డబ్బులు పంపిస్తాం.. అక్కడే ఉండు’అని చెప్పారు కానీ డబ్బు పంపించలేకపోయారని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వం వలస కూలీలను స్వగ్రామాలకు పంపించేందుకు నిర్ణయించిన విషయం తమకు తెలియదని, అయినా ప్రభుత్వాన్ని నమ్మలేమని వ్యాఖ్యానించారు. -
పెళ్లి కోసం 200 కి.మీ. సైకిల్ ప్రయాణం
హరింపుర్: ఉత్తరప్రదేశ్లోని హరింపూర్ జిల్లా పౌతియా గ్రామానికి చెందిన కల్కు ప్రజాపతి (23) తన పెళ్లి కోసం ఏకంగా 200 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. ప్రజాపతి వివాహం ఏప్రిల్ 25న జరగాల్సి ఉండగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడం, వండిపెట్టేందుకు ఎవరూ లేకపోవడంతోనే ప్రజాపతి వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకే, సైకిల్పై పక్క జిల్లాలో ఉన్న వధువు ఇంటికి వెళ్లి, అక్కడ పెళ్లి చేసుకొని తిరుగు ప్రయాణంలో సతీసమేతంగా సైకిల్పై స్వగ్రామం చేరుకున్నాడు. -
సైకిల్పై నిర్మల్ నుంచి జమ్మూకు..
నిర్మల్రూరల్ : జిల్లా కేంద్రంలోని వాసవీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఇటీవలే వేసవి సెలవుల్లో దేశవ్యాప్త సైకిల్ యాత్రను పూర్తి చేసిన ఉపాధ్యాయుడిని స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు బుధవారం ఘనంగా సన్మానించారు. పాఠశాలకు చెందిన సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు భరత్కుమార్ వేసవి సెలవుల్లో నిర్మల్ నుంచి బయలుదేరి ఉత్తర భారతదేశంలోని జమ్ము, గుజరాత్ తదితర రాష్ట్రాలను చుట్టి వచ్చారు. ఈ సందర్భంగా తన యాత్ర సందర్భంగా జరిగిన అనుభవాలను ఉపాధ్యాయుడు విద్యార్థులకు వివరించారు. సైకిల్ యాత్రతో ఆరోగ్యంతో పాటు జాతీయ సమైక్యతను తెలుసుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రకాల ఆచార సంప్రదాయాలను అవగతం చేసుకోవచ్చని తెలిపారు. పాఠశాల సెక్రెటరీ జగదీశ్రెడ్డి, కరస్పాండెంట్ పోతారెడ్డి, ప్రిన్సిపాల్ రాజేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మేమున్నామని.. మీకేం కాదని..
చిత్తూరు అర్బన్: మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, అఘాయిత్యాలు, దాడులకు ప్రధాన కారణం, వాటిపై సరైన అవగాహన లేకపోవడమే. సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి..? ఎవరిని ఆశ్రయించాలి..? ఏం చేయాలి..? అనే విషయంపై వారం క్రితం చిత్తూరు ఎస్పీ రాజశేఖర్బాబు జిల్లాలోని షీ టీమ్స్ పోలీసులు, మహిళా విభాగం పోలీసులతో సమావేశం నిర్వహించారు. మగువలపై ఇటీవల దాడులు ఎక్కువైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. బాధిత మహిళల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలవారే ఉన్నట్లు తేలింది. దీనిపై సమస్యలు వచ్చిప్పుడు కుంగిపోకుండా నిబ్బరంగా ఉండడంతో పాటు దాన్ని పరిష్కారించుకోవడానికి మార్గాలు చూపాలన్నారు. సైకిల్పై తిరుగుతూ మహిళలతో మమేకమై చైత్యన్యం తేవాలని దీనికి ఎవరు ముందుకొస్తారని ప్రశ్నించారు. అడగడమే ఆలస్యంగా నలుగురు యువ మహిళా కానిస్టేబుళ్లు ఆసక్తి చూపడంతో జిల్లాలో నెల రోజుల పాటు దాదాపు 1200 కిలో మీటర్ల దూరం సైకిల్పై తిరుగుతూ ‘అతివల్లో ఆత్మస్థైర్యం నింపుదాం..’ అనే నినాదంతో పల్లెల్లోకి వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు చిత్తూరు నగరం నుంచి ప్రారంభమయ్యే ఈ సైకిల్ యాత్రను కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్బాబులు జెండా ఊపి ప్రారంభించనున్నారు. పయనం ఇలా.. నెల రోజులకు పైగా సాగే సైకిల్ యాత్ర జిల్లాలో దాదాపు 1200 కిలోమీటర్లు తిరుగుతూ వెయ్యి గ్రామాల వరకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో సైకిల్పై వెళ్లే మహిళలకు ఘన స్వాగతం పలుకుతారు. విద్యార్థినులు, మహిళా సంఘాలు, నిరక్షరాస్యులైన మహిళలతో సమావేశమవుతారు. సమస్యలు వచ్చినప్పుడు ఎలా ప్రతిఘటించాలి, చట్టాలు ఏం చెబుతున్నాయి. న్యాయం ఎలా పొందాలన్న విషయాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తారు. అతివలపై జరిగే దాడుల నివారణకు చైతన్యం కల్పించడంతో పాటు ఆత్మహత్మ ఆలోచనల్ని చంపేయడం సమాజంలో ధైర్యంగా నిలబడటంపై కూడా మాట్లాడనున్నారు. వీరే ఆ నలుగురు.. సైకిల్ యాత్రకు ఎస్పీ నలుగురు చాకుల్లాంటి మహిళా కానిస్టేబుళ్లను గుర్తించి, వీరికి ఇప్పటికే శిక్షణ సైతం ఇప్చించారు. పుత్తూరు స్టేషన్లో పనిచేసే తిరుమల (డబ్ల్యూపీసీ–633), బైరెడ్డిపల్లెలోని నిర్మల (డబ్ల్యూపీసీ–721),పలమనేరులోని భార్గవి(డబ్ల్యూపీసీ–676), నాగరత్న(డబ్ల్యూపీసీ–1008)ను ఎంపిక చేశారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement