పెళ్లి కోసం 200 కి.మీ. సైకిల్‌ ప్రయాణం

UP man cycles 200 km alone to marry - Sakshi

హరింపుర్‌: ఉత్తరప్రదేశ్‌లోని హరింపూర్‌ జిల్లా పౌతియా గ్రామానికి చెందిన కల్కు ప్రజాపతి (23) తన పెళ్లి కోసం ఏకంగా 200 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కాడు. ప్రజాపతి వివాహం ఏప్రిల్‌ 25న జరగాల్సి ఉండగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడం, వండిపెట్టేందుకు ఎవరూ లేకపోవడంతోనే ప్రజాపతి వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకే, సైకిల్‌పై పక్క జిల్లాలో ఉన్న వధువు ఇంటికి వెళ్లి, అక్కడ పెళ్లి చేసుకొని తిరుగు ప్రయాణంలో సతీసమేతంగా సైకిల్‌పై స్వగ్రామం చేరుకున్నాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top