Beauty Competitions
-
Miss World 2025: ఘనంగా ముగిసిన గ్రాండ్ ఫినాలే..
ప్రపంచ వేదికపై హైదరాబాద్ నగర ప్రశస్తి మరోసారి అత్యంత వైభవంగా మారుమోగింది. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. 108 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్న ఈ అందాల పోటీల్లో మిస్ థాయిలాండ్ ప్రపంచ సుందరిగా నిలిచింది. నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన భారీ వేదికపై కళ్లు చెదిరే హంగులతో లైటింగ్తో ప్రతిష్టాత్మకంగా ఈ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఈ వేదిక పై భారతీయ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించిన నృత్య కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోడియంపై తెలుగు సెలబ్రిటీలు సందడి చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు క్యాట్ వాక్ చేసే పోడియం ప్యానెల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ రానా దగ్గుబాటి, మరో సినీతార నమ్రత శిరోద్కర్ ఆశీనులయ్యారు. ఇదే వరుసలో ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్, సామాజికవేత్త, మొట్టమొదటిసారిగా మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ విభాగానికి గ్లోబల్ అంబాసిడర్గా ఎన్నికైన తెలుగు మహిళ సుధారెడ్డి ఉన్నారు. మెగా హంగామా.. ఈ పోటీలను వీక్షించడానికి మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి వచ్చారు. ఈ మెగా వేదికపై ప్రముఖ సెలబ్రిటీ ఇషాన్ కట్టర్ చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ విశేషంగా అలరించింది. ఇందులో భాగంగా తను ఆస్కార్ విన్నింగ్ పాట నాటు నాటు సాంగ్కు అదిరిపోయే స్టెప్పులేస్తుంటే.. చిరంజీవి సంతోషంగా చప్పట్లు కొట్టారు. స్టేజ్ పైన వదల బొమ్మాళీ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను ఉత్సాహపరిచిన సోనూసూద్ తెలుగు సినిమాలతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృతజ్ఞతలు తెలిపారు.ఆతిథ్యం అద్భుతం.. ఈ పోటీల నేపథ్యంలో తెలంగాణ అందించిన ఆతిథ్యం అద్భుతమని టాప్ 4లో నిలిచిన పోలండ్ కాంటెస్టెంట్ కొనియాడారు. ఇక్కడి మర్యాదలు ఆత్మీయత తనను కట్టిపడేశాయని.. భాగ్యనగరాన్ని తన రెండో ఇంటిగా అనుభూతి చెందానని సంతోషం వ్యక్తం చేశారు. ప్యానలిస్టుల్లో రానా, నమ్రత.. అంతే కాకుండా ఈ గ్రాండ్ ఫినాలేలో టాప్ 4 మార్టినిక్, ఇథియోఫియా, పోలెండ్, థాయిలాండ్ కాంటెస్టెంట్ లను చివరి ప్రశ్నలు అడిగిన నలుగురు ప్యానలిస్టుల్లో రానా, నమ్రత ఇద్దరూ తెలుగు వారే కావడం గమనార్హం. మరో రెండు ప్రశ్నలు అడిగిన ఇద్దరిలో సోనూ సూద్ కూడా హైదరాబాద్కు సుపరిచితుడే. ( చదవండి: ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా) -
అమెరికా వేదికపై మెరిసిన తెలుగు అందం..! ఎవరీ చూర్ణికా ప్రియ..?
అగ్రరాజ్యం వేదికపై తెలంగాణ తేజం మెరిసింది. అమెరికా మెచి్చన అందం మన హైదరాబాద్ ఏఎస్రావునగర్కు చెందిన చూరి్నకా ప్రియ కొత్తపల్లి సొంతం. ఓ వైపు చదువులో రాణిస్తూనే.. మరోవైపు అందాల పోటీల్లో దూసుకెళ్లింది. ఎంఎస్ కోసం అమెరికా వెళ్లిన చూర్ణికా ప్రియ డల్లాస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో రన్నరప్గా నిలిచింది. ఎవరీ చూర్ణికా ప్రియ..పుట్టింది పశ్చిమగోదావరి భీమవరం. పెరిగింది హైదరాబాద్ ఏఎస్రావునగర్ డివిజన్లోని భవానీనగర్లో.. తల్లిదండ్రులు కొత్తపల్లి రాంబాబు, వనజ ప్రోత్సాహంతో హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన తర్వాత ఎంఎస్ కోసం అమెరికా వెళ్లింది. సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్న ఆమె ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనబర్చాలని నిర్ణయించుకుంది. డల్లాస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025లో పాల్గొంది.ఈ పోటీల్లో మొత్తం 5,300 మంది పాల్గొన్నారు. ఇందులో ఫైనల్కు 20 మంది యువతులు ఎంపికయ్యారు. ఆ తర్వాత టాప్–5, టాప్–3లో చోటు దక్కించుకుని సోమవారం తెల్లవారుజున(అమెరికాలో ఆదివారం అర్ధరాత్రి) జరిగిన గ్రాండ్ ఫైనల్లో రన్నరప్గా నిలిచింది. ఫైనల్ పోటీలకు ప్రముఖ సింగర్ గీతామాధురితో పాటు మరొకరు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అంతేకాదు.. ప్రతిష్టాత్మకమైన పీపుల్స్ చాయిస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆమెకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత మోడలింగ్పై ఆసక్తి పెంచుకుంది. చాలా సంతోషంగా ఉంది తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వేదికపై చాటాలనే లక్ష్యంతో చూర్ణికా ప్రియ ఈ పోటీల్లో పాల్గొంది. మిస్ తెలుగు యూఎస్ఏ–2025లో పాల్గొన్నట్లు మొదట మాకు తెలియదు. టాప్–20లో సెలక్ట్ అయిన తర్వాత మాకు చెప్పింది. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. తర్వాత మోడలింగ్పై ఆసక్తి పెంచుకుంది. తన ఇష్టాలను ఎప్పుడూ కాదనలేదు. తనకు నచ్చిన రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నాం. టాప్–3లో ఉన్నాను ఫైనల్కు సెలక్ట్ అయ్యాను చెప్పింది. తర్వాత ఫోన్ చేసి ఫైనల్లో రన్నరప్గా నిలిచాను అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. – కొత్తపల్లి రాంబాబు, తండ్రి(చదవండి: కాన్స్ ముగింపు వేడుకలో గూచీ చీరలో మెరిసిన అలియా..! పాపం నాలుగు గంటలు) -
మిస్ అమెరికాగా ఎయిర్ఫోర్స్ అధికారిణి!
కొలరాడోకు చెందిన 22 ఏళ్ల మాడిసన్ మార్ష్ మిస్ అమెరికా 2024 అందాల పోటీల్లో విజేతగ నిలిచి కిరీటాన్ని దక్కించుకుంది. ఆమెఎయిర్ఫోర్స్ అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మిస్ అమెరికా టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. కొలరాడోకు ప్రాతినిధ్యం వహిస్తున్న మార్ష్ ఓ పక్కన అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ ఘనత సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో పంచుకుంది. "మీకు ఆకాశమే హద్దు!. మిమ్మల్ని ఆపగలిగే వారే లేరు. రెండు పడవల మీద కాలు వేయలేం అనే వాళ్లకు నా విజయమే ఓ సమాధానం. మీ అభిరుచి ఎంతటి కష్టమైనా తట్టుకుని సాధించేలా చేయగలదు." అని ఇన్స్టాగ్రాంలో రాసుకొచ్చింది మార్ష్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక మార్ష్ మే 2023లో మిస్ కొలరాడో కిరీటం కూడా గెలుచుకుంది. ఆమె ఎయిర్ఫోర్స్ అకాడమీ నుంచి ఫిజిక్స్ పట్టా పొందే కొద్ది రోజుల ముందే ఈ విజయం సాధించింది. Congratulations to our very own #Airman, 2nd Lt. Madison Marsh, aka Miss Colorado — who was just crowned @MissAmerica 2024! Marsh is the first active duty servicemember to ever win the title.#AimHigh pic.twitter.com/3RuDu5CulW — U.S. Air Force (@usairforce) January 15, 2024 మార్ష్ ఒక పక్క ఎయర్ఫోర్స్లో రెండవ లెఫ్టినెంట్గా కఠినతరమైన బాధ్యతలు చేపట్టడమేగాక మిస్ హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీని కూడా చేస్తూ..ఈ మిస్ అమెరికా అందాల పోటీకి ప్రీపేర్ అయ్యింది. నాకు ఇష్టమైన రెండు విభిన్న రంగాలను చేపట్టి సాధించడం చాలా అద్భుతంగా ఉందని అంటోంది మార్ష్. "మీపై మీకు నమ్మకం ఉంటే మిమ్మలని మీరు ఒక్కచోటకే పరిమితం చేయాల్సిన పనిలేదు. ధైర్యంగా అడగు వేయండి". అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది మార్ష్. ఈ అందాల పోటీకి తాను ఎయిర్ఫోర్స్లో జాయిన్ అయ్యేందుకు తీసుకున్న శారీరక శిక్షణ ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. కాగా ఈ మిస్ అమెరికా అందాల పోటీల్లో మార్స్ మిస్ అమెరికాగా కిరీటాన్ని దక్కించుకోగా, టెక్సాస్కు చెందిన ఎల్లీ బ్రూక్స్ రన్నరప్గా నిలిచింది. View this post on Instagram A post shared by Miss America (@missamerica) (చదవండి: మిసెస్ ఇండియాగా 55 ఏళ్ల మహిళ! గెలుపుకి ఏజ్తో పనలేదని ప్రూవ్ చేసింది!) -
మిసెస్ ఇండియాగా 55 ఏళ్ల మహిళ!
అందాల పోటీల్లో పాల్గొనేవాళ్లంతా టీనేజర్లు, పెళ్లి కానీ వాళ్లే ఉంటారు. ఇటీవల ఇంకాస్త ముందడుగు వేసి పెళ్లైన వాళ్లు కూడా పాల్గొని స్ఫూర్తిగా నిలిచారు. కానీ వాటన్నింటిని దాటి ఐదు పదుల వయసులో అది కూడా ఇద్దరు పిల్లల తల్లి అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటి శభాష్ అనిపించుకుంది. చెప్పాలంటే ఆమె గెలుపు చారిత్రాత్మక విజయానికి నాంది పలికింది. వివరాల్లోకెళ్తే.. జమ్మూ నగరానికి చెందిన 55 ఏళ్ల రూపికా గ్రోవర్ మోడల్ మిసెస్ ఇండియా వన్ ఇన్ ఏ మిలియన్ 2023 అందాల పోటీల్లో గెలిచి చరిత్ర సృష్టించింది. సక్సెస్కి వయోపరిమితి ఉండదని ప్రూవ్ చేసింది. ప్రతి మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె నటి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. ఆమె నటన, మోడలింగ్ ప్రపంచంలోకి చాలా నిర్భయంగా అడుగుపెట్టి తానెంటో ప్రూవ్ చేసుకున్న ధీశాలి. బాలీవుడ్ దిగ్గజ నటులు అమితా బచ్చన్, రణవీర్సింగ్ వంటి లెజెండరీ నటులతో కలిసి పనిచేసింది. అంతేగాదు ఆమె ఇద్దరు పిల్లల తల్లి కూడా. ఇక రూపిక గ్రోవర్ ఫిట్ క్లాసిక్, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్లాసిక్, టాలెంటెడ్ క్లాసిక్ వంటి టైటిళ్లను కూడా దక్కించుక్ను టాలెంటెడ్ మహిళ. ఇద్దరు పిల్లల తల్లిగానూ అలాగే తన కెరీర్ పరంగా అచంచలంగా దూసుకుపోతూ మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇక్కడ ఆమె కనబర్చిన ఆచంచలమైన నిబద్ధత, అంకితబావాలే ఆ విజయాల పరంపరను తెలియజేస్తున్నాయి. ఆమె విజయగాథ ఎలాంటి పరిస్థితులోనైనా తమ డ్రీమ్స్ని వదులకోకుండా కృషి చేయలని తెలుపుతోంది. దేనిలోనైన విజయ సాధించాలంటే అటెన్షన్ ఉంటే చాలు వయసుతో సంబంధం లేదని చాటి చెటి చెప్పింది. ఇక ఈ మిసెస్ ఇండియా వన్ ఏ మిలియన్ అనేది దేశంలో వివాహిత మహిళల కోసం ప్రత్యేకంగా కండెక్ట్ చేస్తున్న అందాల పోటీ. ఇది మహిళలంతా విజేతలే అనే లక్ష్యంగా ఈ పోటీలను పెడుతోంది. తమ కలలను వాస్తవంలోకి తీసుకురాలేకపోయిన మహిళలకు ఇదోక గొప్ప వేదిక. ఈ పోటీల్లో రూపికా గ్రోవర్ చారిత్రాత్మక విజయాన్ని సాధించి మహిళందరికి ప్రేరణగా నిలిచింది. ఆమెలాంటి ఎందరో మహిళలు ధైర్యంగా తమ కలలను నెరవేర్చుకునేందుకు రూపికా గ్రోవర్ గెలుపే స్పూర్తినిస్తుంది. View this post on Instagram A post shared by Rupika Grover (@rupikagrover) (చదవండి: ఎవరీమె? ఆమె స్పీచ్కి..పార్లమెంటే దద్దరిల్లింది!) -
ఆఫ్రికా అందం
-
‘మిస్ నెల్లూరు-2016’ పోటీలు
నెల్లూరు: ప్యూచరాల్, క్యాచ్మి ఆధ్వర్యంలో సాయిక్రియేటీవ్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్వహిస్తున్న మిస్ నెల్లూరు-2016 అందాల పోటీల ఫైనల్స్ను ఆదివారం నిర్వహంచనున్నట్లు కొరియోగ్రాఫర్, స్టైలిస్ట్ రష్మీఠాగూర్ తెలిపారు. నగరంలోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పోటీలకు మొత్తం 102 మంది హాజరు కాగా, మౌఖిక పరీక్షల అనంతరం 20 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. నగరంలోని కస్తూరిదేవీ గార్డెన్స్లో ఆదివారం సాయంత్రం జరిగే ఫైనల్ పోటీలో మిస్ నెల్లూరు-2016ను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. వీరితో పాటు మరో ఇద్దరిని ఎంపిక చేసి మిస్ ఆంధ్రా పోటీ లకు పంపుతామన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా డైరక్టర్ యమునా కిషోర్, హీరో భరత్, బాలీవుడ్ హీరోయిన్ ఏక్తా త్రివేది, పారిశ్రామిక వేత్త సన్మోహన్రెడ్డి వ్యవహరించనున్నట్లు తెలిపారు. ప్రముఖ సినీ నటుడు ఆలీ హాజరుకానున్నట్లు చెప్పారు. ఫ్యాషన్ డిజైనర్ దివ్య, ప్రో గ్రామ్ హెడ్ మాధురిమోహన్, బ్యూటీషియన్ మహితారెడ్డి పాల్గొన్నారు. -
చక్దే చక్కదనం
అందానికి అందం సొంతం చేసుకున్న ఈ పుత్తడి బొమ్మలు ఫ్యాషన్ వేదికపై తళుక్కుమన్నాయి. నగరంలోని ‘గుజరాతీ-రాజస్థానీ’ కమ్యూనిటీలు సంయుక్తంగా నిర్వహించనున్న ‘చక్దే’ ఈవెంట్ ఏ రేంజ్లో ఉంటుందో తమ సోయగాలతో ట్రైలర్ చూపించారు చక్కనమ్మలు. ఈ నెల 21న మొదలయ్యే ఈ ఫెస్ట్ మార్చి 1 వరకు కొనసాగనుంది. ఆర్ట్స్, స్పోర్ట్స్, కల్చర్, టీ20 క్రికెట్ టోర్నమెంట్, రియాలిటీ షోలు, అందాల పోటీలు, డ్యాన్స్ కాంపిటీషన్స్... ఇలా మొత్తం 15 రకాల ఈవెంట్లు ఉంటాయని నిర్వాహకులు గురువారం తెలిపారు. ఇందులో 11 ఈవెంట్లను తమ కమ్యూనిటీకి మాత్రమే పరిమితం చేసినా, మిగిలిన వాటిలో నగరవాసులు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు.