ముంబై, బెంగళూరులో భారీ వర్షాలు..
ముంబై/బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, బెంగళూరులో వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏకధాటిగా కురిసిన వర్షానికి ముంబై నగరం అతలాకుతలం అయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వృక్షాలు కూలిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బెంగళూరులో దాదాపు 36 గంటలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో సాధారణ జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.ముంబై, పూణెతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఈదారుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రత్నగిరి జిల్లాలోని వెర్వాలి, విలావాడే రైల్వేస్టేషన్ల మధ్య కొండచరియలు విరిగిపడడంతో కొంకణ్ రైల్వే మార్గంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. Thankyou @mybmc for this wonderful treatment! #MumbaiRains #WeatherAlert Location: Andheri E, Near Subway pic.twitter.com/JRur1BRPPR— Bhairavi Wamorkar (@Bhaiiravii) May 20, 2025అలాగే కోస్తా కొంకణ్-గోవా మార్గంలో భారీ బండరాయి పడడంతో మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలను కలిపే 741 కిలోమీటర్ల మార్గంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. జల్వాయు కాంప్లెక్స్ సమీపంలో చెట్లు కూలిపోయాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో వాహనదారులు వేరే మార్గాల్లో వెళ్లాల్సి వచ్చింది. మరో నాలుగు రోజుల పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల గంటకు 30-40 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.Pre-monsoon and Mumbai is already drowning. All of Modi’s grand claims to make it a high-tech city are floating in floodwater. Any responsible Prime Minister would’ve resigned seeing this state but here, not even a single tweet for Mumbaikars’ safety#Mumbai#MumbaiRains pic.twitter.com/x6bSfufPBx— Pritesh Shah (@priteshshah_) May 20, 2025మరోవైపు, భారీ వర్షాల నేపథ్యంలో బెంగళూరు నగరంలోని మాన్యత టెక్ పార్క్, సిల్క్ బోర్డ్ జంక్షన్లలో వంటి ప్రాంతాల్లో మోకాలి లోతు వరద నిలిచిపోయింది. వాహనాలు మొరాయించడంతో వాహన దారుల అవస్థలు వర్ణనాతీతం. వర్షం సంబంధిత ప్రమాద ఘటనల్లో మరణాల సంఖ్య అయిదుకు చేరింది. సాయి లేఔట్లోకి భారీగా వరద చేరడంతో చిన్నపాటి దీవిని తలపిస్తోంది. నివాసాల్లోని గ్రౌండ్ఫ్లోర్లోకి నీరు చేరడంతో అందులోని వారు బయటకు రాలేక, లోపల ఉండలేక అవస్థలు పడుతున్నారు. ఆ లేఔట్లోని కనీసం 150 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరందరికి అధికార యంత్రాంగం ఆహారం, నీరు సరఫరా చేసింది. వరదతో నిండిన హెన్నూర్ అనాథాశ్రమంలోని వారిని కూడా కాపాడారు. ఇలా ఉండగా, కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలోని ఏడు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరుకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. INCKarnataka promised: Brand BengaluruWhat @INCKarnataka delivered:Beach Bengaluru#CongressFailsKarnataka #BangaloreRains pic.twitter.com/YJrlbrJEM1— Naveen Kamadolli (@NaveenKamadolli) May 19, 2025 Why companies are building in Bangalore when taxes are not used in Infrastructure.It's time to rethink#BangaloreRains pic.twitter.com/4qWNnz1BlA— Anshul Garg (@AnshulGarg1986) May 20, 2025