-
Hyderabad: విషాదం.. చిన్నారిని బలిగొన్న వీధి కుక్కలు
శంషాబాద్: హైదరాబాద్లో మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఏడాది వయసున్న చిన్నారి మృతి చెందింది. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మున్సిపాలిటీ ప్రాంతంలో చోటుచేసుకుంది. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారానికి చెందిన సూర్యకుమార్, యాదమ్మ దంపతులు బతుకుదెరువు కోసం శంషాబాద్కు వలస వచ్చారు. అయితే వారు రాళ్లగూడ సమీపలోని ఓ గుడిసెలో తమ ఏడాది వయసున్న కుమారుడు నాగరాజుతో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం యాదమ్మ నిండు గర్భిణి కావటంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం రాత్రి చిన్నారి పాల కోసం ఏడవగా తండ్రి ఆ చిన్నారికి పాలు తాగించి నిద్రపుచ్చాడు. తెల్లవారుజామున ఆ చిన్నారి మళ్లీ ఏడుస్తూ గుడిసె బయటకు రాగా రోడ్డుమీద ఉన్న వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. అక్కడి నుంచి వస్తున్న శబ్దాలను విన్న పలువురు వాహనదారులు పల్లాడిపై దాడి చేస్తున్న కుక్కలను తరిమేశారు. వారు చిన్నారిని పరిశీలించగా.. అప్పటికే మృతి చెందాడు. ఈ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఇప్పటికే మృతి చెందగా.. మరో చిన్నారి వీధి కుక్కలు బలితీసుకోవంటంతో బోరున విలపిస్తున్నారు. -
చిన్నారి ప్రాణం తీసిన కొబ్బరిముక్క
సాక్షి, వరంగల్: పది నెలల తమ కుమారుడు ఏడుస్తున్నాడని కొబ్బరి ముక్క చేతిలో పెట్టాడు తండ్రి.. కానీ, ఆ కొబ్బరి ముక్క.. ఆ బుడిబుడి మాటల బాలుడి ప్రాణాలు తీసింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పెద్దకొర్పోలు శివారు వెంకటతండా జీపి పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తండా వాసులు, బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన దరావత్ కవిత–మాలు దంపతులు. మాలు అయ్యప్ప స్వామి మాలధారణ చేశాడు. కాగా, అయ్యప్ప పూజ కార్యక్రమంలో తల్లిదండ్రులు నిమగ్నమై ఉండగా.. తమ కుమారుడు మణికంఠ(10నెలలు) ఏడుస్తుండడంతో కొబ్బరిముక్క ఇచ్చారు. కొబ్బరిముక్క బాబు గొంతులో ఇరుక్కొపొయి నోటి నుంచి నురుగు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నెక్కొండకు తీసుకువస్తున్న క్రమంలో ఊపిరిఆడక బాలుడు మృతి చెందాడు. చదవండి: నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసిన కారు.. -
నా భార్య.. బిడ్డ కావాలంటోంది
సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్): ‘‘నా భార్య బిడ్డ కావాలంటొంది.. మాకు ఏడేళ్ల తర్వాత బిడ్డ పుడుతుందనుకుంటే కడుపులోనే చంపేసి చేతికిచ్చారు’’ అని బుధవారం కామారెడ్డి ఆస్పత్రిలో మృతి చెందిన శిశువు తండ్రి రమేష్ వైద్యులు, పోలీసులు ఎదుట వాపోయాడు. ఆస్పత్రిలో బుధవారం రాత్రి శిశువు మృతి చెందిన సంఘటనలో గురువారం బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని ప్రసవం గది ముందు ఆందోళన చేశారు. అక్కడే నర్సులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆస్పత్రి బయట ధర్నా చేశారు. పోలీసులు, ఆర్ఎంవో డాక్టర్ శ్రీనివాస్తో వాగ్వాదానికి దిగారు. గైనిక్ వైద్యురాలు పట్టించుకోకపోవడం, నర్సులు నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఎంవో కాళ్లు మొక్కి న్యాయం చేయాలని కోరారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఫిర్యాదు చేసే కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. చదవండి: శుభకార్యానికి వచ్చి .. భర్తకు పూటుగా మద్యం తాగించి.. ఆతర్వాత -
గొంతులో అన్నం మెతుకు ఇరుక్కుని చిన్నారి మృతి
పావగడ: గొంతులో అన్నం మెతుకు ఇరుక్కుని 9 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకాలోని రాజవంతి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన రాజప్ప, భారతి దంపతులకు సత్య (9 నెలలు) సంతానం. ఆదివారం ఉదయం భారతి వంట చేస్తుండగా... కుమారుడు సత్య ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలుడు పక్కనే ఉన్న గిన్నెలోని అన్నం తినేందుకు ప్రయత్నించగా...అన్నం మెతుకు గొంతులో ఇరుక్కుని ఊపిరి ఆడక ఏడ్వటం ప్రారంభించాడు. వెంటనే గుర్తించిన భారతి చిన్నారిని తీసుకుని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అయితే ఆ సమయంలో చిన్న పిల్లల వైద్యుడు అందుబాటులో లేకపోవడం.. వైద్యం అందించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో బాలుడు మృత్యువాత పడ్డాడు. చదవండి: బ్యాంకులో ఉరివేసుకున్న మహిళ బ్యాంక్ మేనేజర్ -
విషాదం: మిస్టరీగా నెలల బాలుడి మృతి
శాలిగౌరారం (నకిరేకల్) : నెలల బాలుడి మృతి మిస్టరీగా మారింది. ఈ ఘటన శాలిగౌరారం మండలం ఆకారంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకారం గ్రామానికి చెందిన ఇంద్రకంటి యల్లయ్యకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె సంతోష(26)ను మండలంలోని వల్లాలకు చెందిన ఆడెపు యాదగిరికి ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు(10 నెలలు) ఉన్నారు. ఏడాది కాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత జనవరి 23న ఆకారంలోని తన తల్లిగారింటికి వచ్చిన సంతోష ఈనెల 3న కుమారుడితో ఇంటినుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. సఖ్యతగా మెలుగుతున్న వ్యక్తితో వెళ్లి.. జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన బాలకిషన్ అత్తగారు గ్రామం ఆకారం. సంతోష పుట్టిల్లు, బాలకిషన్ అత్తగారి ఇల్లు పక్కపక్కనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ఈనెల 3న ఇంటినుంచి వెళ్లి కోదాడలో కాపురం పెట్టారు. అయితే, అనుకోకుండా మంగళవారం సంతోష కుమారుడికి ఫిట్స్ వచ్చాయి. వెంటనే వారు కోదాడలోని ఓ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. వైద్యుల సూచన మేరకు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడు చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత మృతిచెందాడు. గ్రామంలో ఉద్రిక్తత బాలుడి మృతదేహంతో సంతోష కారులో బుధవా రం తెల్లవారుజామున గ్రామానికి చేరుకుంది. పుట్టింటికి కాకుండా సమీప బంధువు ఇంటికి వెళ్లి విషయాన్ని వివరించింది. బాలుడు మృతిచెందిన విషయం తెలుసుకున్న యాదగిరి (బాలుడితండ్రి) కుటింబికులు వల్లాలకు చేరుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఆకారం గ్రామానికి చేరుకొని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, బాలుడిని సంతోష, బాలకిషన్లు తలపై కొట్టి హత్య చేసి ఉంటారని తండ్రి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, బాలుడి మృతదేహాన్ని వల్లాల తీసుకెళ్లేందుకు తండ్రి యాదగిరి కుటుంబ సభ్యులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు నచ్చజెప్పి బాలుడి మృతదేహానికి నకిరేకల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి తండ్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బా లుడి మృతదేహంపై అంతర్గతంగా , బహిర్గతంగా ఎలాంటి గాయాలు లేనట్లు వైద్య నివేదికలో వెల్లడైనట్లు ఎస్ఐ తెలిపారు. బాలుడి తల్లి సంతోషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, సంతోష తండ్రి యల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ఇద్దరూ అన్యోన్యంగా.. అంతలోనే ఏమైందో..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement