breaking news
Australia Women
-
ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆసీస్..
మహిళల వన్డే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో జట్టు మరో అలవోక విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.టామీ బీమాంట్ (105 బంతుల్లో 78; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... అలైస్ క్యాప్సీ (38) రాణించింది. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3 వికెట్లు పడగొట్టగా... యాష్లే గార్డ్నర్, మోలినో చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఆ్రస్టేలియా 40.3 ఓవర్లలో 4 వికెట్లకు 248 పరుగులు సాధించి విజయాన్నందుకుంది. యాష్లే గార్డ్నర్ (73 బంతుల్లో 104 నాటౌట్; 16 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించగా... అనాబెల్ సదర్లాండ్ (112 బంతుల్లో 98 నాటౌట్; 9 ఫోర్లు 1 సిక్స్) త్రుటిలో శతకానికి దూరమైంది. ఒకదశలో ఆ్రస్టేలియా 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే గార్డ్నర్, సదర్లాండ్ ఐదో వికెట్కు అభేద్యంగా 180 పరుగులు జోడించి గెలిపించారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన సదర్లాండ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. గాయం కారణంగా కెప్టెన్ అలీసా హీలీ ఈ మ్యాచ్కు దూరమైనా ఆ్రస్టేలియాకు ఎలాంటి సమస్య ఎదురు కాలేదు.చదవండి: PKL 2025: భరత్ ఒంటరి పోరాటం.. హర్యానా చేతిలో తెలుగు టైటాన్స్ చిత్తు -
చేతులెత్తేసిన బ్యాటర్లు.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
ముంబై: బ్యాటింగ్ వైఫల్యంతో భారత మహిళల జట్టు మూడో టి20లో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్ల సిరీస్లో 2–1తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (47 బంతుల్లో 75; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్రేస్ హారిస్ (18 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఆంధ్ర అమ్మాయి అంజలి శర్వాణి, రేణుక సింగ్, దీప్తి శర్మ, దేవిక తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులే చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (41 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్స్లు) మెరిసింది. హర్మన్ప్రీత్ (27 బంతుల్లో 37; 6 ఫోర్లు), దీప్తి శర్మ (17 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్, ఆష్లే గార్డెనర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 17న ఇదే వేదికపై నాలుగో టి20 మ్యాచ్ జరుగుతుంది. చదవండి: Kane Williamson: కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం.. ఇకపై -
చివరి బంతికి రనౌట్.. మ్యాచ్ టై
-
చివరి బంతికి రనౌట్.. మ్యాచ్ టై
కాఫ్స్ హార్బర్: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డే అభిమానులకు అసలైన క్రికెట్ మజా అందించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ టైగా ముగిసింది. 243 పరుగుల లక్ష్యంతో దిగిన సౌతాఫ్రికా విజయానికి దాదాపుగా చేరువైంది. 49.5 ఓవర్లలో జట్టు స్కోరు 242/9. చేతిలో మరో వికెట్ ఉండగా, చివరి బంతికి మరో రన్ చేస్తే విజయం వరిస్తుంది. విలాని వేసిన ఆఖరి ఓవర్ చివరి బంతిని ఆడిన క్లాస్ సింగిల్ తీసేందుకు వెళ్లింది. మూనీ.. క్లాస్ను రనౌట్ చేయడంతో సౌతాఫ్రికా ఆశలు ఆవిరయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కూడా 49.5 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమంగా కావడంతో మ్యాచ్ టై అయ్యింది. ఐదు వన్డేల సిరీస్ను ఆసీస్ ఇప్పటికే 3-0తో సొంతం చేసుకోగా, సౌతాఫ్రికా ఇంకా బోణీ కొట్టలేదు. ఆస్ట్రేలియా జట్టులో బోల్టన్ (63), పెరీ (69) హాఫ్ సెంచరీలతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లు లూస్ నాలుగు, వాన్ నీకెర్క్ మూడు వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా జట్టులో వాన్ నీకెర్క్ (81), కాప్ (66) అర్ధశతకాలు బాదారు. ఆస్ట్రేలియా బౌలర్ జొనాసెన్ మూడు వికెట్లు తీసింది. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ వాన్ నీకెర్క్ ఆల్ రౌండ్ షోతో రాణించినా ఫలితం లేకపోయింది. -
వెస్టిండీస్ టార్గెట్ 149
కోల్ కతా: మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ కు ఆస్ట్రేలియా 149 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్టేలియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. విలానీ, లానింగ్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. విలానీ 37 బంతుల్లో 9 ఫోర్లతో 52 పరుగులు చేసింది. కెప్టెన్ లానింగ్ 49 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగులు సాధించింది. హీలీ 4, పెరీ 28, బ్లాక్ వెల్ 3 పరుగులు చేశారు. చివరి ఓవర్ లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయడం విశేషం. విండీస్ బౌలర్లలో డొతిన్ 2 వికెట్లు పడగొట్టింది. మాథ్యూస్, మొహమ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు.