breaking news
Anish Giri
-
గోవాతో నాకెన్నో జ్ఞాపకాలు: వరల్డ్ చాంపియన్ గుకేశ్
ఫిడే ప్రపంచకప్-2025 (FIDE World Cup 2025) టోర్నమెంట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ మెగా చెస్ ఈవెంట్కు వేదిక కాగా.. గోవాలో అక్టోబరు 31- నవంబరు 27 వరకు టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఉత్తర గోవాలోని ఓ రిసార్టులో టోర్నీ నిర్వహించనున్నారు.మొత్తంగా 82 దేశాల నుంచి 206 మంది చెస్ క్రీడాకారులు ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనబోతున్నారు. నాకౌట్ ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో టాప్-3లో నిలిచిన వాళ్లు 2026 క్యాండిడేట్స్ ఈవెంట్కు అర్హత సాధించారు. విజేతకు ప్రైజ్మనీ 20,00,000 డాలర్లు.గోవాతో నాకెన్నో జ్ఞాపకాలుఈ నేపథ్యంలో వరల్డ్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ (D Gukesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వరల్డ్కప్ టోర్నీ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. స్వదేశంలో ఎక్కడ ఆడినా ఈ టోర్నీ ప్రత్యేకంగా మిగిలిపోతుంది.ముఖ్యంగా గోవాతో నాకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని జూనియర్ లెవల్ ఈవెంట్లలో ఆడాను’’ అంటూ ఈ టాప్ సీడ్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా గుకేశ్ 2019లో గోవా వేదికగా ఇంటర్నేషనల్ ఓపెన్ గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. నాడు కేటగిరీ- ‘ఎ’ నుంచి పోటీపడిన గుకేశ్ పదో స్థానంతో ముగించాడు.ఫేవరెట్గా అనిశ్ గిరి కూడా..అయితే, ఈసారి ఏకంగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో గుకేశ్ బరిలోకి దిగనుండటం విశేషం. ఇక గుకేశ్తో పాటు.. నేపాల్ సంతతికి చెందిన డచ్ గ్రాండ్మాస్టర్ అనిశ్ గిరినీ టోర్నీలో ఫేవరెట్గా పోటీలో నిలిచాడు. ఇప్పటికే అతడు ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్-2025కి అర్హత సాధించాడు. కాగా 2005 నుంచి నాకౌట్ ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఫిడే వరల్డ్కప్ టోర్నీలో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్తో పాటు అర్మేనియాకు చెందిన లెవాన్ ఆరోనియన్ మాత్రమే రెండుసార్లు టైటిల్ గెలవగలిగారు.చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు! -
విశ్వనాథన్ ఆనంద్ బోణీ
చెన్నై: లెజెండ్స్ ఆఫ్ చెస్ ఆన్లైన్ టోర్నీలో మాజీ ప్రపంచ చాంపియన్, భారత నంబర్వన్ విశ్వనాథన్ ఆనంద్ ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేశాడు. ఇప్పటివరకు తొలి ఆరు రౌండ్లలో వరుసగా స్విద్లెర్, కార్ల్సన్, క్రామ్నిక్, అనీశ్ గిరి, పీటర్ లెకో, నెపోమ్నియాచి చేతిలో ఓటమి పాలైన ఆనంద్ ఏడో రౌండ్ గేమ్లో ఇజ్రాయెల్ గ్రాండ్మాస్టర్ గెల్ఫాండ్ బోరిస్పై విజయం సాధించాడు. సోమవారం జరిగిన ఈ గేమ్లో ఆనంద్ 2.5–0.5తో బోరిస్పై నెగ్గాడు. -
హరికృష్ణకు వరుసగా ఆరో ‘డ్రా’
టాటా స్టీల్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ ఖాతాలో వరుసగా ఆరో ‘డ్రా’ చేరింది. నెదర్లాండ్్సలోని విక్ ఆన్ జీ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం అనీష్ గిరి (నెదర్లాండ్్స)తో జరిగిన 11వ రౌండ్ గేమ్లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 36 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. 14 మంది గ్రాండ్మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో 11వ రౌండ్ తర్వాత హరికృష్ణ 5.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. -
ఆనంద్ గేమ్ ‘డ్రా’
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆరో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో ఆదివారం జరిగిన 13వ రౌండ్ గేమ్ను ఆనంద్ 52 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రస్తుతం ఆనంద్ ఖాతాలో ఏడు పాయింట్లు ఉన్నాయి.


