
కురుపాం (#KurupamHealthCrisis ) గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలలో పచ్చకామెర్లకు గురైన బాలికలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గురువారం(అక్టోబర్ 9) నాడు ఉమ్మడి విశాఖ పర్యటనకు వెళ్లిన (#ChaloNarsipatnam) మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (#YSJaganMohanReddy) అక్కడికి వెళ్లారు.

చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ భరోసా కల్పించారు. బాలికల ఆరోగ్య పరిస్థితి, చికిత్స విధానం గురించి వైద్యులతో వివరాలు తెలుసుకున్నారు. (#YSJaganMedicalColleges)









