 
							టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్ మూవీలో నటిస్తోంది.
 
							వీరిద్దరు జంటగా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.
 
							చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
 
							తాజాగా ఈ మూవీకి సంబంధించిన విశేషాలను చిత్రబృందం ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించింది.
 
							హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో నాగచైతన్య, సాయిపల్లవి కూడా పాల్గొన్నారు.
 
							ఈ సందర్భంగా హీరోయిన్ సాయిపల్లవిపై చైతూ ప్రశంసలు కురిపించారు.
 
							సాయిపల్లవిని బాక్సాఫీస్ క్వీన్ అంటూ కొనియాడారు.
 
							తనతో డ్యాన్స్ చేయాలంటే నాకు కాస్తా భయంగానే ఉంటుందని చైతూ అన్నారు.
 
							తాజాగా తండేల్ మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు.
 
							వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
 
							 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
