మాదాపూర్ : శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా –2026లో నృత్యపురి డాన్స్ అకాడమీ ఒడిస్సీ, సంబల్పూరి నృత్యాలు, సుచీ గ్రూప్ జానపద ప్రదర్శనలు సందర్శకులను అలరించాయి.
నారీశక్తి పేరిట నిర్వహించిన ర్యాంప్వాక్, స్టార్ సింగర్ ఈశ్వరీ బెహరా గానం, బనిశ్రీ కళానికేతన్ గిరిజన నృత్యాలను ఆద్యంతం ఆకట్టుకున్నాయి.
ఈ మేళాలో భాగంగా కళాకారులు తయారు చేసిన ఉత్తులు సందర్శకులను కట్టిపడేశాయి. మాదాపూర్ శిల్పారామంలో ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్మేళా –2026 శుక్రవారం ప్రారంభమైంది.
కార్యక్రమాన్ని శిల్పారామం ప్రత్యేక అధికారి జి.కిషన్రావు, ఎన్ఎండీసీ మాజీ డైరెక్టర్ కె.మహంతి, ఐఆర్డీఏఐ మాజీ సభ్యుడు సత్యజిత్ త్రిపాఠి పాల్గొన్నారు.
మేళాలో 30 స్టాల్స్కి పైగా హస్తకళా ఉత్పత్తులు, 20 ఫుడ్ స్టాల్స్ అందుబాటులో ఉంచారు. ఔత్సాహిక నగరవాసులు మేళాలో ఒడిశా రుచులను ఆస్వాదించారు.


