దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రముఖ సినీ నటులు సుమన్, హాస్యనటులు అలీ ఆదివారం కడపకు వచ్చారు. దర్గాను దర్శించుకుని గురువుల మజార్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారికి దర్గా ముజావర్ అమీర్ గురువుల చరిత్ర, విశిష్ఠతలను తెలియజేసి ప్రసాదాలు అందజేశారు.


