
తిరుపతి స్మార్ట్ సిటీలో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కచ్చపి ఆడిటోరియం, సుకృతి కళానిలయాన్ని ఆదివారం తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, నగర మేయర్ డాక్టర్ శిరీష, స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ హరిత, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఆధ్యాత్మిక నగరం తిరుపతి గడిచిన నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందని, నగరానికి శోభను తీసుకొచ్చే ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం ద్వారా కొత్త తిరుపతి ఆవిష్కృతం అవుతుందని తిరుపతి శాసనసభ్యులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు.


ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ సరస్వతీ దేవి వీణ పేరు అయిన కచ్చపి పేరును ఎంపిక చేయడం వెనుక తిరుపతి కళలకు కాణాచిగా విరాజిల్లాలన్న ఆలోచనతోనే పెట్టామన్నారు.
































