ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల్లో భాగంగా వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరిగింది.
ర్యాలీ సాంతం కేరింతలు, తమ రాష్ట్రానికే పరిమితమైన నృత్యాలతో అంబరాన్నంటేలా సంబరాలు చేశారు.
ఫెస్టివల్ ర్యాలీలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ ప్రాంతీయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు.
విద్యార్థులతో కలిసిన అధ్యాపకులు, ఆచార్యులు కూడా తమ వయసుకు యువరక్తాన్ని దట్టించి మరీ సందడిని రెట్టింపు చేశారు.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


