సంప్రదాయబద్ధంగా నిర్వహించిన మండమెలిగె పూజలతో మేడారం మహాజాతర ఆరంభమైంది.
బుధవారం మేడారం, కన్నెపల్లిలోని ఆలయాల్లో సమ్మక్క– సారలమ్మ పూజారులు ఆచార సంప్రదాయాలతో అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు జరిపారు.
దిష్టి తగలకుండా ప్రధాన కూడళ్లలో సొరకాయ, కోడిపిల్ల, మామిడి ఆకులతో తోరణాలు కట్టారు.
రాత్రంతా గద్దెల వద్ద జాగారాలు చేసి సంబురాలు జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.


