అద్దంకి: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి 71వ వార్షిక తిరునాళ్ల సోమవారం కన్నుల పండువగా నిర్వహించారు.
తిరునాళ్ల సందర్భంగా ఆలయ పరిసరాలన్నీ భక్తజన సందోహంతో కిక్కిరిశాయి. ప్రాకార మండపాలు, గాలి గోపురాలు విద్యుత్ కాంతుల్లో ధగధగ మెరిసిపోయాయి. ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో మునిగిపోయారు.
తిరునాళ్ల సందర్భంగా ఆలయ రాజగోపురాలు, పరిసరాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ సెట్టింగులతో క్షేత్రం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోయింది.
దేవస్థానం ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయ స్వామివారి ఉత్సవ మూర్తులను రథంపై ఉంచి మాడ వీధుల్లో ఊరేగించారు.


