
ఖైరతాబాద్: మహా గణపతి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. ఆదివారం నగరం నలు దిక్కుల నుంచి భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో ఖైరతాబాద్ రైల్వేగేట్, సెన్సేషన్ థియేటర్, మింట్ కాంపౌండ్, ఐమాక్స్ పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రాన్ని తలపించాయి. అడుగు తీసి అడుగు వేయలేనంతగా రద్దీతో వీధులన్నీ నిండిపోయాయి.



































