చీరాల : పాడి పశువుల పోషణలో ఆశించిన లాభాలను గడించాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించాలని అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ ఎం.హనుమంతరావు తెలిపారు. దాణా ఖర్చులు తగ్గించుకోవడం, పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆరోగ్య పరిరక్షణ ద్వారా అధిక లాభాలు పొందవచ్చన్నారు. పశుపోషణపై ఆయన సలహాలు, సూచనలు ఇచ్చారు.
తాగునీటి యాజమాన్యం..
పాడిపశువులకు ఎప్పుడూ పరిశుభ్రమైన మంచినీటిని అందుబాటులో ఉంచాలి. రోజూ నీటి తొట్టెలను శుభ్రం చేయాలి. 15 రోజులకొకసారి బ్లీచింగ్ పౌడర్తో నీటి తొట్టెలను శుభ్రపరచాలి. మురుగు నీరు, కుంటల్లో నిల్వ ఉన్న నీటిని తాగించకూడదు. ఈ నీటిలో హానికర బ్యాక్టీరియా, నట్టలు ఉండడం వల్ల పారుడు వ్యాధి సోకవచ్చు.
పోషణ..
రోజుకు 5 లీటర్ల పాలు ఇచ్చే పాడి పశువుకు రోజూ 20 కిలోల పచ్చిమేత, 7 కిలోల ఎండుమేత, కిలో దాణా ఇవ్వాలి. 3 లీటర్ల పాలు ఇచ్చే వాటికి 2 కిలోల దాణా అదనంగా ఇవ్వాల్సిఉంటుంది. ఖనిజ లవణ మిశ్రమం రోజూ 50 గ్రాముల చొప్పున దాణాలో కలిపి ఇస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది. పచ్చిమేత లభించని సమయంలో పాతరగడ్డి, సుపోషకం చేసిన వరిగడ్డిని వాడుకోవాలి. గడ్డిని కట్టర్ ద్వారా ముక్కలుగా చేసి పశువులకు వేయడం ద్వారా వృథాను అరికట్టవచ్చు.
పునరుత్పత్తి సామర్థ్యం..
పాడిపశువుల పెంపకంలో లాభదాయకత పశువుల పునరుత్పత్తి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈతకు-ఈతకు మధ్య 13-14 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు. పశువు ఈనిన 90-120 రోజుల మధ్య కాలంలో ఎదకు వస్తుంది. ఈ ఎద చాలా ఫలప్రదమైంది. చాలామంది రైతులు ఈ సమయంలో గేదెను దాటిస్తే పాల ఉత్పత్తి తగ్గిపోతుందనే భ్రమతో ఆ ఎదను ఉపయోగించుకోరు. దీంతో కొన్ని పశువుల్లో గర్భకోశం నిద్రావస్థలోకి వెళ్లి మళ్లీ ఎద లక్షణాలు వెంటనే కనిపించవు.
పూర్తిగా పాల ఉత్పత్తి తగ్గిన తర్వాత మాత్రమే పశువు ఎదకు రాలేదన్న సంగతి గుర్తించి, ఎద వచ్చేందుకు మందులు వాడుతారు. కొందరు పశుపోషకులు ఈ సమయంలో అలాంటి పశువులను అమ్మేయడమో లేక కబేళాకు తరలించడమో చేస్తుంటారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ విధంగా కబేళాలకు తరలించే పశువుల్లో 8-12 శాతం పశువులు చూడివిగా ఉంటున్నాయి. పునరుత్పత్తి యాజమాన్యంపై రైతులకు అవగాహన లేమితో ఈ ఘోరం జరుగుతోంది.
ఏమి చేయాలి..
పాడి పశువు ఈనిన 90-120 రోజుల మధ్య వచ్చే ఎదలో పశువును కచ్చితంగా కట్టించాలి. 3 నెలల తర్వాత చూడి పరీక్ష చేయించాలి. చూడి నిర్ధారణ అయితే మరో 4 నెలల (అంటే 7 నెలలు చూలు వచ్చేంత వరకు) పాలు పిండుకోవాలి. ఆ తర్వాత చివరి మూడు నెలలు చూడి గేదెకు విశ్రాంతి ఇవ్వాలి. ఈ విధంగా 10 నెలలు (300 రోజులు) పాల ఉత్పత్తిని పొందినట్లయితే మరో 3 నెలల తర్వాత గేదెమళ్లీ ఈని పాల ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఇది లాభదాయకం.
మేలైన పద్ధతులతో పశుపోషణ పండగే..
Published Thu, Nov 13 2014 3:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
Advertisement