న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు డిసెంబర్ 16న ముగియనున్నాయి. ఈ నెల 13న సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నవంబర్ 16 నుంచి.. డిసెంబర్ 16 వరకూ నిర్వహించాలని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేస్తూ లోక్సభ సెక్రటేరియట్ బుధవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. రాజ్యసభ సెక్రెటరీ జనరల్ షంషేర్ కె షరీఫ్ కూడా ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా, ప్రస్తుత సమావేశాలు 16వ లోక్సభలో 10వ సెషన్ కాగా.. రాజ్యసభకు 241వ సెషన్ కావడం గమనార్హం. సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో ప్రారంభమవుతాయి.
అయితే ఈసారి వీటిని కాస్త ముందుకు జరిపి నవంబర్ 16నే సమావేశాలను ప్రారంభిస్తున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముందుగానే నిర్వహించనున్న నేపథ్యంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కి సంబంధించి మిగిలి ఉన్న సెంట్రల్ జీఎస్టీ(సీజీఎస్టీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ(ఐజీఎస్టీ) చట్టాలను నవంబర్ చివరినాటికి లేదా డిసెంబర్ మొదటి వారంలో ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వానికి మార్గం సుగమమవుతుంది. జీఎస్టీ బిల్లులతో పాటు డజను బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ఆర్మీ సర్జికల్ దాడుల అంశం కీలకంగా మారే అవకాశాలున్నాయి.
డిసెంబర్ 16 వరకు పార్లమెంట్
Published Thu, Oct 20 2016 2:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
వరంగల్
తప్పక చదవండి
Advertisement