వీసా గడువు ముగిసినా అమెరికాలో నివసిస్తున్న వారి సంఖ్య పెరగ డంపై ఆందోళన మొదలైంది.
సాన్ డియాగో: వీసా గడువు ముగిసినా అమెరికాలో నివసిస్తున్న వారి సంఖ్య పెరగ డంపై ఆందోళన మొదలైంది. సక్రమంగా ప్రవేశించి వీసా కాలం చెల్లినా అక్కడే ఉంటున్న విదేశీయుల సంఖ్యను గణించి దాదాపు 20 ఏళ్లు గడిచింది. హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించిన తాజా సమాచారం మేరకు...2015లో దేశాన్ని వదిలి వెళ్లాల్సిన సుమారు 5,27,127 మంది వీసా గడువు ముగిసినా అక్కడి నుంచి కదల్లేదు.
ఈ సంఖ్య అట్లాంటా పట్టణం జనాభా కన్నా ఎక్కువే. అదే సమయంలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 3,37,117 మందిని సరిహద్దు గస్తీ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీటిలో చాలామటుకు మెక్సికో సరిహద్దు వద్దే జరిగాయి.