- గతేడాది కంటే ఈసారి పెరగనున్న ఉష్ణోగ్రతలు ∙45 నుంచి 48 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం
- వారం ముందుగానే వేసవిలోకి ప్రవేశం ∙గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతోనే అంటున్న శాస్త్రవేత్తలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అప్పుడే మహబూబ్ నగర్లో రెండుసార్లు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ చొప్పు న గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవంగా మార్చి ఒకటో తేదీ నుంచి వేసవి సీజన్ మొదలు కావాలి. కానీ వారం ముందుగానే అంటే ఫిబ్రవరి చివరి వారంలోనే ఎండా కాలంలోకి ప్రవేశించామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
గత 24 గంటల్లో మహబూబ్నగర్, హైదరాబాద్లలో సాధారణం కంటే ఐదు డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో 38 డిగ్రీలు... మహబూబ్నగర్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. హకీంపేట, హన్మకొండ, ఖమ్మంలలో సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలా రాష్ట్రం అప్పుడే అగ్నిగుండంలోకి వెళ్తోంది. గ్లోబల్ వార్మింగ్, పట్టణీకరణ నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాస్త్రజ్ఞులు విశ్లేషిస్తున్నారు.
గతేడాది కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువే...
ఫిబ్రవరిలోనే ఈ స్థాయిలో ఎండలు మండుతుండటంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన నెలకొంది. గతేడాది ఫిబ్రవరి 23వ తేదీన మెదక్లో 39.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే 24వ తేదీన హన్మకొండలో 39.1 డిగ్రీలు, నిజామాబాద్లో 40.6 డిగ్రీలు నమోదైంది. గ్లోబల్ వార్మింగ్, పట్టణీకరణ ఫలితంగా 1980 నుంచి ప్రతీ పదేళ్లకు ఒకసారి 0.01 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుందని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో ఈ ఎండాకాలంలోనూ రాష్ట్రంలో గతేడాది కంటే కూడా అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంటోంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు రాష్ట్రంలో ఎండలు నమోదు కావాలి.
అయితే ఈసారి మాత్రం 45 నుంచి 48 డిగ్రీల వరకు కూడా ఎండలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టంచేసింది. వచ్చే వారం నుంచి ఎండలు మరింత ముదురుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్నినో ప్రస్తుతానికి తటస్థంగా ఉందని... రాబోయే రోజుల్లో అది ఏ స్థితికి వస్తుందో చూడాలని అంటున్నారు. అది కూడా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే ఎండలు ఇంకా మండుతాయని విశ్లేషిస్తున్నారు. వచ్చే నెల నుంచే వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నుంచి అవి మరింత పుంజుకుంటాయని అంటున్నారు.
ఆగస్టు, సెప్టెంబర్లలో ఎల్నినో?
గత రెండేళ్లుగా రుతుపవనాలను బలహీనం చేసిన ఎల్నినో ఈ ఏడాది కూడా దుష్ప్రభావం చూపనుందా? అంటే అవునంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్నినో ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వాతావరణ మోడళ్లూ కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని స్కైమెట్ శాస్త్రవేత్త మహేశ్ ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఈ అంచనాలు ప్రస్తుతానికి మాత్రమేనని, ఈ ఏడాది రుతుపవనాలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం మార్చి చివరినాటికి, లేదంటే ఏప్రిల్ 15 నాటికి మాత్రమే తెలుస్తుందని ఆయన చెప్పారు.
నడినెత్తిన నిప్పులే..!
Published Sat, Feb 25 2017 3:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement