చోరీకెళ్లిన దొంగ మృతి | Thief dies to go for theft | Sakshi
Sakshi News home page

చోరీకెళ్లిన దొంగ మృతి

Oct 4 2015 1:26 PM | Updated on Sep 3 2017 10:26 AM

నల్గొండ జిల్లా చర్లపల్లిలో పప్పుల రాములు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ ప్రమాదవశాత్తూ చనిపోయాడు.

నల్గొండ: నల్గొండ జిల్లా చర్లపల్లిలో పప్పుల రాములు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ ప్రమాదవశాత్తూ చనిపోయాడు. చోరీ చేసిన తర్వాత వంటగదిలో ప్రమాదవశాత్తూ కిందజారిపడ్డాడు. కిందపడిన సమయంలో తల నేలకు బలంగా తాకడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.

చనిపోయిన దొంగ తిప్పర్తి మండలం కాజీరామారం మండలానికి చెందిన నాగరాజు(35)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement