breaking news
Kicthen
-
ఆ సమస్యలకు చెక్ పెట్టే ఈ ఎకో–ఫ్రెండ్లీ గ్రిల్ ధర సుమారు 17 వేలు!
ఓపెన్ కిచెన్ అయినా, ఇరుకు వంటగది అయినా.. వంటకాల వాసన, ఆ తాలూకు పొగ ప్రతి ఇంటా ప్రధాన సమస్యయి కూర్చుంటోంది. ఎంత ఘుమఘుమలైనా ఎంతసేపని ఆస్వాదిస్తాం. పైగా ఊపిరితిత్తులకు ఏమంత మంచిది కాదని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అందుకే ఆ సమస్యకు చెక్ పెడుతుంది ఈ ఎకో–ఫ్రెండ్లీ గ్రిల్. చూడటానికి లారీ షేప్లో ఉంటుంది. డివైజ్కి ఒకవైపు రెగ్యులేటర్తో పాటు ఒక చిన్న బటన్ ఉంటుంది. దాన్ని ఆన్ చేస్తే.. డివైజ్ కింద ఒక ఫ్యాన్ తిరుగుతూ పొగ పైకి రాకుండా.. డివైజ్కిరువైపులా ఉన్న చిన్నచిన్న హోల్స్ నుంచి కింద ఉండే ట్రేలోకి చేరుతుంది. ముందుగా ఆ ట్రేలో వాటర్ నింపుకుని గాడ్జెట్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. పైగా దీనిలోని ఐటమ్స్ గ్రిల్ చేసుకోవడానికి ఉపయోగించే గ్రిల్.. నలువైపులా ఎత్తుగా ఉండి మధ్యలో కిందకు వాలి, అక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. దాంతో గ్రిల్ అవుతున్నప్పుడు వ్యర్థాలు కిందకు చేరతాయి. దీనిలో ఇతర వంటకాలకు వీలుగా సమాంతరంగా ఉండే ప్రత్యేకమైన పాన్ కూడా ఉంటుంది. వాటిని అమర్చుకోవడం, క్లీన్ చేసుకోవడం చాలా సులభం. -ధర : 239 డాలర్లు (రూ.17,859) చదవండి: The Bellaire House: నిజంగా నిజమిది.. అసలు ఆ ఇంట్లోకి ఆత్మలు ఎలా వచ్చాయంటే! -
వేయించుకు తినండి
ఇలా అయినా వానలు బాగా పడతాయని కిచెన్లో చేస్తున్న హోమమిది. తిన్నంతసేపూ ఎండని మరచిపోతాం. ఎందుకంటే వేయించుకుని తింటే వేడివేడిగా ఉంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు వానపడాలని కోరుకుంటాం కదా...మీ మనోవాంఛా ఫల సిద్ధిరస్తు! మూంగ్ దాల్ సమోసా కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు; చల్లటి నీళ్లు – తగినన్ని (పిండి కలపడానికి). ఫిల్లింగ్ కోసం: పొట్టు పెసర పప్పు – 3 కప్పులు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; గరం మసాలా – 3 టీ స్పూన్లు; మిరప కారం – 3 టీ స్పూన్లు; మెంతి పొడి – 1 టీ స్పూను; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి -చల్లటి నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలిపి అరగంట సేపు పక్కన ఉంచాలి – పిండిని ఉండలు చేసుకుని, చపాతీలా గుండ్రంగా ఒత్తి, రెండు భాగాలు అయ్యేలా మధ్యకు కట్ చేయాలి –ఒక భాగాన్ని తీసుకుని అంచుల దగ్గర తడి చేసి, కోన్ ఆకారంలో చుట్టి, అంచుల దగ్గర గట్టిగా అదమాలి -పొట్టు పెసర పప్పును మిక్సీలో వేసి కొద్దిగా రవ్వలా అయ్యేలా మిక్సీ పట్టాలి -స్టౌ మీద బాణలి వేడయ్యాక నూనె వేయాలి -జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి -మిక్సీ పట్టిన పెసర పప్పు రవ్వను జత చేసి దోరగా వేయించాలి -గరం మసాలా, మిరప కారం, మెంతి పొడి, ధనియాల పొడి, ఉప్పు, ఆమ్చూర్ పొడి జత చేసి మరోమారు వేయించి దింపి చల్లారనివ్వాలి -తయారుచేసి ఉంచుకున్న సమోసా మౌల్డ్లోకి ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఉంచి, అంచులు మూసేయాలి -ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి -స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి - పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి. రా బనానా అండ్ కోకోనట్ కచోరీ కావలసినవి: అరటికాయలు – 4 (పెద్దవి); బియ్యప్పిండి – 3 టేబుల్స్పూన్లు; ఉప్పు – తగినంత; పచ్చి మిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూన్ ఫిల్లింగ్ కోసం: వేయించిన పల్లీల పొడి – 4 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి పేస్ట్ – ఒక టేబుల్ స్పూను; తాజా కొబ్బరి తురుము – ఒక కప్పు; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – తగినంత; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. యోగర్ట్ కోసం: పెరుగు – 100 గ్రా.; ఉప్పు – తగినంత; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన పల్లీల పొడి – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన నువ్వులు – ఒక టేబుల్ స్పూను; పచ్చి మిర్చి పేస్ట్ – ఒక టేబుల్ స్పూను; దానిమ్మ గింజలు – కొద్దిగా తయారీ: -అరటి కాయలను ఉడికించి తొక్క తీసి చేతితో మెత్తగా మెదపాలి -ఒక పాత్రలో అరటి కాయ ముద్ద, బియ్యప్పిండి, పచ్చి మిర్చిపేస్ట్, ఉప్పు, ఒక టేబుల్ స్పూను నూనె వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. ఫిల్లింగ్ తయారీ: - ఒక పాత్రలో కొబ్బరి తురుము, పచ్చి మిర్చి పేస్ట్, పల్లీల పొడి, వేయించిన నువ్వులు, కిస్మిస్, జీలకర్ర, కరివేపాకు, పంచదార, నిమ్మ రసం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి - అరటి కాయ మిశ్రమాన్ని ఉండలుగా చేయాలి - చేతికి నూనె పూసుకుని, ఒక్కో ఉండను చేతిలోకి తీసుకుని కచోరీ ఆకారంలో చేయాలి - ఫిల్లింగ్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా కచోరీ లో నింపి, గుండ్రంగా చే సి, పైన బియ్యప్పిండి అద్ది పక్కన ఉంచాలి -ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి -స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న కచోరీలను వేసి దోరగా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి -యోగర్ట్లో ముంచి అందించాలి. బ్యాంగ్ బ్యాంగ్ కావలసినవి:బేబీ పొటాటోస్ – పావు కేజీ; ఉప్పు – తగినంత; – 2 (ముక్కలు చేయాలి); పసుపు – అర టీ స్పూను; బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – మూడు; వెల్లుల్లి తరుగు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు. తయారీ: ∙బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించాలి ∙చల్లారాక తొక్క తీయాలి -ఒక పాత్రలో ఉప్పు, పంచదార, ఎండు మిర్చి ముక్కలు, పసుపు, బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి ∙బంగాళ దుంపలను అందులో వేసి దొర్లించాలి -స్టౌ మీద బాణలిలో పాన్ ఉంచి వేడయ్యాక పచ్చి మిర్చి వేసి వేయించాలి -బేబీ పొటాటోలను వేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి -మధ్యమధ్యలో కలుపుతుండాలి -బంగాళ దుంపలు బంగారు రంగులోకి మారగానే దింపేయాలి. – నిర్వహణ వైజయంతి -
చోరీకెళ్లిన దొంగ మృతి
నల్గొండ: నల్గొండ జిల్లా చర్లపల్లిలో పప్పుల రాములు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ ప్రమాదవశాత్తూ చనిపోయాడు. చోరీ చేసిన తర్వాత వంటగదిలో ప్రమాదవశాత్తూ కిందజారిపడ్డాడు. కిందపడిన సమయంలో తల నేలకు బలంగా తాకడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. చనిపోయిన దొంగ తిప్పర్తి మండలం కాజీరామారం మండలానికి చెందిన నాగరాజు(35)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.