ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని ఏపీని కోరిన సుప్రీం | supreme court ordered ap govt for impede petition on Eamcet counselling | Sakshi
Sakshi News home page

ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని ఏపీని కోరిన సుప్రీం

Jul 16 2014 3:57 PM | Updated on Sep 2 2018 5:20 PM

ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని ఏపీని కోరిన సుప్రీం - Sakshi

ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని ఏపీని కోరిన సుప్రీం

ఎంసెట్ కౌన్సెలింగ్‌ వాయిదా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఈ నెల 21న విచారణ జరపనుంది.

న్యూఢిల్లీ: ఎంసెట్ కౌన్సెలింగ్‌ వాయిదా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఈ నెల 21న విచారణ జరపనుంది. ఎంసెట్ కౌన్సెలింగ్‌ పై ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఏపీ వాదనలను పరిశీలించిన గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.

ఎంసెట్ కౌన్సెలింగ్‌ పై అక్టోబర్‌ 31 వరకు తెలంగాణ ప్రభుత్వం గడువు కోరింది. స్థానికత అంశంపై ఎటూ తేలకపోవడంతో కౌన్సెలింగ్‌ వాయిదాకు తెలంగాణ సర్కార్ పట్టుబడుతోంది. మరోవైపు  కౌన్సెలింగ్‌ ఎప్పుడు జరుగుతుందో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement