పడవ బోల్తా : 20 మందికిపైగా గల్లంతు | Singaporean, Japanese and French among more than 20 missing after tug boat capsizes in China | Sakshi
Sakshi News home page

పడవ బోల్తా : 20 మందికిపైగా గల్లంతు

Jan 16 2015 10:37 AM | Updated on Sep 2 2017 7:46 PM

పడవ బోల్తా : 20 మందికిపైగా గల్లంతు

పడవ బోల్తా : 20 మందికిపైగా గల్లంతు

చైనాలోని జియాంగ్జూ నదిలో గురువారం పడవ బోల్తా పడింది.

చైనా: చైనాలోని జియాంగ్జూ నదిలో గురువారం పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారని ఉన్నతాధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో విదేశీయులు కూడా ఉన్నారని తెలిపారు. గల్లంతైన వారిలో ముగ్గురిని సహాయక బృందం రక్షించారని చెప్పారు.

గల్లంతైన వారి ఆచూకీ కోసం ఇప్పటికే 23 నౌకలు, పడవలను నదిలో జల్లిడి పడతున్నాయని తెలిపారు. అయితే నదిలో నీటి ఉధృతి అధికంగా ఉండటంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందన్నారు. గల్లంతైన విదేశీయుల్లో జపాన్, సింగపూర్, ఫ్రెంచ్ దేశాలకు చెందిన ఎనిమిది మంది ఉన్నారని ఉన్నతాధికారులు చెప్పారు.ఈ ప్రమాదం గురువారం సాయంత్రం చోటు చేసుకుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement