
ఎస్ఐ మృతి.. ఇసుక మాఫియాపై అనుమానం!
రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేష్ మృతిపై సీఐడీ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేష్ మృతిపై సీఐడీ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మృతి వెనక ఇసుక మాఫియా హస్తం ఉందేమోనన్న అనుమానాలు ఉన్నాయని, ఈ కారణంగానే తాము విచారణకు ఆదేశించామని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.
ఎస్ఐ రమేష్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తున్నట్లు నాయిని తెలిపారు.