►మౌలిక వసతులతోపాటు రైళ్ల వేగం రెట్టింపు చేస్తామన్న మంత్రి
►ఉద్యోగుల జీతాలు పెంచితే రైల్వేపై రూ.30 వేల కోట్ల భారం
►ప్రయాణ, సరుకు రవాణా చార్జీలు యథాతథం
►మరి నిధులు ఎక్కడ్నుంచి తెస్తారంటున్న నిపుణులు
►కష్టకాలం అంటూనే.. కొత్త రైళ్లు, ప్రాజెక్టుల ప్రకటన
న్యూఢిల్లీ ‘‘భారత రైల్వే వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. ప్రస్తుతం అత్యంత కఠిన సవాళ్లను ఎదుర్కొంటోంది..’’ బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించిన నిష్టుర సత్యమిది! మరి బడ్జెట్ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించిందా? మంత్రి ప్రతిపాదనలు రైల్వేను పట్టాలెక్కించే విధంగానే ఉన్నాయా? కొందరు నిపుణులు మాత్రం బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని పేర్కొంటున్నారు. ఓవైపు డబ్బులు లేవంటూనే.. మరోవైపు కొత్త రైళ్లు, కొత్త ప్రాజెక్టులు ప్రకటించడాన్ని చూస్తుంటే మంత్రి నేల విడిచి సాము చేసినట్టుగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. రైల్వేకు కొత్త ఊపిరులూదుతామని, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామన్న మంత్రి.. బడ్జెట్లో అందుకు కావాల్సిన ఆదాయ మార్గాలను స్పష్టంగా చూపలేదు. భారత రైల్వేల ద్వారా ఏటా 700 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. 100 కోట్ల టన్నుల సరుకును రవాణా చేస్తోంది. వీటిద్వారా గణనీయమైన ఆదాయం సాధిస్తామని కిందటేడాది బడ్జెట్లో ప్రకటించారు. కానీ ఆ మేరకు ఆదాయం ఆర్జించలేదు. ఈసారి బడ్జెట్లో ప్రయాణికుల చార్జీల ద్వారా అదనంగా 12.4 శాతం ఆదాయాన్ని పొందుతామని, కిందటేడాది కన్నా అదనంగా మరో 5 కోట్ల టన్నుల సరుకును రవాణా చేస్తామని మంత్రి చెప్పారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి ఈ పరిమిత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కానీ రద్దీ మార్గాల్లో సాధారణ ప్రయాణికుల కోసం అంత్యోదయ ఎక్స్ప్రెస్ వంటి కొత్త రైళ్లను ప్రకటించడంలో సంయమనం పాటించలేదని నిపుణులు చెబుతున్నారు. అలాగే దీన్ దయాల్ కోచ్లు, ఉదయ్ పేరుతో డబుల్ డెక్కర్ సర్వీసులను ప్రకటించడం కేవలం ప్రయాణికులను సంతృప్తిపరిచేందుకే అని అభిప్రాయపడుతున్నారు.
అలాగే ప్రస్తుతం గంటకు 30 కి.మీ. ఉన్న రైళ్ల సగటు వేగాన్ని రెట్టింపు చేస్తామని, అందుకు 2,800 కి.మీ. మార్గాన్ని నిర్మిస్తామని చెప్పారు. వీటితోపాటు రైళ్లు, రైల్వే స్టేషన్లలో పెద్దఎత్తున మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. వీటన్నింటికీ భారీగా నిధులు కావాలి. అదీగాకుండా ఏడో వేతన సవరణ కమిషన్ సిఫారసుల ప్రకారం 13 లక్షల రైల్వే ఉద్యోగులకు జీతాలు పెంచితే రూ.30 వేల కోట్ల భారం పడుతుంది. రైల్వే వ్యవస్థ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పిన మంత్రి.. వీటన్నింటికీ ఎక్కడ్నుంచి నిధులు తెస్తారన్న అంశాన్ని మంత్రి స్పష్టంగా చెప్పలేదు. అటు ప్రయాణికుల చార్జీలు, సరు రవాణా చార్జీలను ఏమాత్రం ముట్టుకోకుండా ఇంత పెద్దఎత్తున నిధులు ఎక్కడ్నుంచి తెస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రాజెక్టులు సరే..పైసలేవి ప్రభు!
Published Fri, Feb 26 2016 5:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement