పాక్ మరోసారి కాల్పుల ఉల్లంఘన | Pakistan again violates ceasefire | Sakshi
Sakshi News home page

పాక్ మరోసారి కాల్పుల ఉల్లంఘన

Oct 15 2013 12:40 PM | Updated on Mar 23 2019 8:40 PM

భారత్ సరిహద్దుల్లోని ఎల్ఓసీ వద్ద పాకిస్థాన్ దళాలు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు దిగుతుందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

భారత్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాకిస్థాన్ దళాలు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు దిగుతుందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ ఆర్. కే. పాల్టా మంగళవారం ఇక్కడ వెల్లడించారు. నిన్న సాయంత్రం బాగా పొద్దుపోయిన తరువాత ఎల్ఓసీ సమీపంలోని పూంచ్ జిల్లాలోని మెందార్ సెక్టర్పై పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయి.

 

దాంతో భారత దళాలు అప్రమత్తమైనాయి. ఎదురు దాడికి దిగాయా. దాంతో ఇరువైపులా 10 నిముషాల పాటు కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే పాక్ కాల్పుల వల్ల భారత్ భద్రత దళాలకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. 2003లో భారత్, పాక్ దేశాలు ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఇటీవల కాలంలో తరుచుగా పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement