అడ్డగోలు ట్యాపింగ్‌కు చెక్! | Sakshi
Sakshi News home page

అడ్డగోలు ట్యాపింగ్‌కు చెక్!

Published Sat, Jan 11 2014 5:26 AM

Now, Taping system under control to Indian Telegraph Act

న్యూఢిల్లీ: ఎవరో చెబితే అడ్డగోలుగా ఫోన్లు ట్యాపింగ్ చేయడం, గిట్టనివారిపై అక్రమంగా నిఘా పెట్టడం వంటివి ఇకపై కుదరవు! ఫోన్ సంభాషణలను అధికారికంగా ట్యాపింగ్ చేయాల్సి వస్తే టెలికం కంపెనీలు కచ్చితంగా కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుం దని కేంద్రం స్పష్టంచేసింది. టెలికం శాఖ ఈ మార్గదర్శకాలను రూపొందించి, ఈనెల 2న అన్ని టెలికం కంపెనీలకు పంపింది. అలాగే ఎస్‌ఎంఎస్, ఎంఎంఎస్, ఇంటర్నెట్ టెలిఫోన్‌లను కూడా భారత టెలిగ్రాఫ్ చట్టం పరిధిలోకి తీసుకువచ్చారు. ఫోన్లను ట్యాపింగ్ చే యాలంటూ రాతపూర్వకంగా, ఫోన్ల ద్వారా, ఫ్యాక్స్ ద్వారా వచ్చే విజ్ఞప్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని తన మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement