దశల వారీగా మద్యం షాపులన్నీ బంద్ | Now MP to become dry state, all liquor shops to be shut down in phases | Sakshi
Sakshi News home page

దశల వారీగా మద్యం షాపులన్నీ బంద్

Apr 10 2017 7:27 PM | Updated on Oct 8 2018 3:17 PM

దశల వారీగా మద్యం షాపులన్నీ బంద్ - Sakshi

దశల వారీగా మద్యం షాపులన్నీ బంద్

దశల వారీగా మద్యం షాపులన్నింటినీ మూసివేయించి, రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేయనున్నట్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.

భోపాల్: దశల వారీగా మద్యం షాపులన్నింటినీ మూసివేయించి, రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేయనున్నట్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. నర్సింగ్‌పూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

'తొలి విడతలో నర్మద నదికి ఇరువైపులా 5 కిలో మీటర్ల పరిధిలోని షాపులన్నింటినీ మూసివేయిస్తాం. రెండో విడతలో నివాస ప్రాంతాల్లో, విద్యా సంస్థలు, ప్రార్థన స్థలాలకు సమీపంలో మద్యం షాపులను అనుమతించం. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తాం' అని చౌహాన్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో మధ్యనిషేధం విధించాలని ఆందోళనలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement