ఎరువుల శాఖలో లంచాల బాగోతం!! | Norway indicts Yara officials for bribing Indian bureaucrat | Sakshi
Sakshi News home page

ఎరువుల శాఖలో లంచాల బాగోతం!!

Jan 17 2014 8:36 PM | Updated on Oct 1 2018 6:45 PM

యూపీఏ పాలన సమస్తం లంచాల బాగోతమేనన్న విషయం మరోసారి బయటపడింది. నార్వేకు చెందిన యారా ఇంటర్నేషనల్ అనే ఎరువుల తయారీ సంస్థ మన దేశానికి ఎరువులు సరఫరా చేసే కాంట్రాక్టు కోసం ఇక్కడి మంత్రిత్వశాఖ అధికారులకు లంచాలు ఇచ్చింది.

యూపీఏ పాలన సమస్తం లంచాల బాగోతమేనన్న విషయం మరోసారి బయటపడింది. నార్వేకు చెందిన యారా ఇంటర్నేషనల్ అనే ఎరువుల తయారీ సంస్థ మన దేశానికి ఎరువులు సరఫరా చేసే కాంట్రాక్టు కోసం ఇక్కడి మంత్రిత్వశాఖ అధికారులకు లంచాలు ఇచ్చింది. ఈ కేసులో ఆ కంపెనీకి చెందిన ముగ్గురు మాజీ సీనియర్ మేనేజిమెంట్ అధికారులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.

కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వశాఖలోని ఆర్థిక సలహాదారు కుటుంబానికి ఈ లంచం చెల్లించినట్లు ఓస్లో నుంచి వచ్చిన కథనాలను బట్టి తెలుస్తోంది. భారతదేశంతో పాటు లిబియా, రష్యాలలోని అధికారులకు కూడా లంచాలు ఇచ్చినందుకు గాను ఈ కంపెనీకి చెందిన అధికారులకు నార్వే ప్రభుత్వం దాదాపు 295 కోట్ల రూపాయల జరిమానా విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement