'రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్' | Narendra Modi to push for pet projects during NDA high tea | Sakshi
Sakshi News home page

'రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్'

Oct 26 2014 7:38 PM | Updated on Aug 15 2018 2:20 PM

'రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్' - Sakshi

'రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్'

రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్టు తెలిసింది.

న్యూఢిల్లీ: రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్టు తెలిసింది. ఎన్డీఏ ఎంపీలకు ఆదివారం సాయంత్రం మోదీ తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీలకు ప్రభుత్వ పథకాలపై ప్రధాని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.

పోలియో నిర్మూలించగలిగాం, స్వచ్ఛ భారత్ ను సాధించగలం అంటూ ఎంపీలను మోదీ ఉత్సాహరిచారు. నెహ్రూ జయంతి సందర్భంగా పాఠశాలలను సందర్శించి పరిశుభ్రత ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించాలన్నారు. పేదల సంక్షేమానికి సంబంధించి కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీలకు మోదీ సూచించినట్టు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement