breaking news
NDA MPs
-
స్వదేశీ మేళాకు పట్టం కట్టండి
న్యూఢిల్లీ: స్నేహితుడు, శత్రువు అనే బేధం లేకుండా అమెరికా ప్రభుత్వం అందరిపై సుంకాలతో బాదేస్తున్న వేళ ప్రధాని మోదీ స్వదేశీరాగం అందుకున్నారు. విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకుని స్వదేశీ వస్తువులకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో సోమవారం ఎన్డీఏ కూటమి ఎంపీలతో సమావేశంలో పలు అంశాలపై ప్రధాని మాట్లాడారు. ‘‘దేశవాళీ ఉత్పత్తులకు ఆదరణ పెరిగేలా చూడండి. స్వదేశీ మేళాను ఉద్యమస్థాయికి తీసుకెళ్లండి. విదేశాల అధిక టారిఫ్ల వంటి ప్రతికూలతలు, సవాళ్ల సమయంలో భారత్ స్వావలంబన ద్వారా తన శక్తిసామర్థ్యాలను మరింతగా సంతరించుకోవాల్సిన తరుణమిది. మేడిన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించండి. జీఎస్టీ రేట్లు భారీగా తగ్గిన చక్కటి తరుణంలో స్వదేశీ వస్తువుల గొప్పతనాన్ని జనాన్ని తెలిసేలా చేయండి. ముఖ్యంగా నవరాత్రి, దీపావళి వంటి పండుగల సీజన్లో మీమీ నియోజకవర్గాల్లో ప్రజలతో, వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటుచేసి తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రయోజనాలను వివరించండి’’అని మోదీ అన్నారు. మోదీ ప్రసంగ వివరాలను తర్వాత కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు మీడియాకు వివరించారు. అమెరికా 50 శాతం టారిఫ్ భారం మోపిన వేళ మోదీ స్వదేశీ వస్తువుల ప్రాశస్థ్యాన్ని ప్రస్తావించడం గమనార్హం. శక్తివంతమయ్యేవేళ సవాళ్లు సాధారణం ‘‘భారత్ శక్తివంతంగా ఎదిగే క్రమంలో సవాళ్లు ఎదురవడం సాధారణం. అయినాసరే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే క్రమంలో ఇలాటి సవాళ్లను ఎదుర్కొంటూ ఆత్మనిర్భర్ను సాధించాలి. సొంత నియోజకవర్గాల్లో దేశీయ ఉత్పత్తుల ప్రచారాన్ని మీరే నాయకులుగా ముందుండి నడపాలి. గతంలో భారత్లో జపాన్ తయారీ వస్తువుల వినియోగం అధికంగా ఉండేది. అలాంటి భారత్లో ఇప్పుడు దేశీయోత్పత్తులను అధికంగా ఉపయోగించగల్గుతున్నామని గర్వపడేలా మనం చేయాలి. మీరు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో స్వదేశీ ఉత్పత్తులు కనిపించాలి. ఉపయోగించాలి’’అని ఎంపీలకు మోదీ సూచించారు. ‘‘జీఎస్టీ శ్లాబుల తొలగింపు అనేది ప్రజల్లో పెను సంచలనంగా మారింది. ప్రజలతో ‘స్వదేశీ మేళాలు’, వ్యాపారులతో ‘వ్యాపారీ సమ్మేళన్’లు నిర్వహించండి. గాల్లో తుపాను చెలరేగినాసరే మనం వాహన టైరులో మళ్లీ గాలి కొట్టాల్సిందే. అలాగే దేశీయంగా ‘స్వదేశీ వాతావరణం’ఉన్నాసరే మన మళ్లీ విడిగా మన వంతు తోడ్పాటు అందించాల్సిందే’’అని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జాగ్రత్త ‘‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేటప్పుడు ఎంపీలు జాగ్రత్త వహించండి. తప్పులు దొర్లకుండా ఓటేయండి. పార్లమెంట్ సభ్యులే ఓటింగ్లో తప్పులు చేస్తే ప్రజలకు తప్పుడు సందేశం వెళ్తుంది. మన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లో ఉత్తమ అభ్యర్థిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన ఉపరాష్ట్రపతిగా చక్కటి సేవలు అందిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. తన పాలనాదక్షతతో ఆయ ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తేగలరని నేనూ విశ్వసిస్తున్నా’’అని అన్నారు. ఇటీవల పార్లమెంట్లో ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందం వెనుక అధికార కూటమి ఎంపీల కృషిదాగి ఉందని మోదీ ప్రశంసించారు. హిమాచల్, పంజాబ్కు నేడు మోదీ వరద విలయంలో చిక్కుకుని అల్లాడిపోతున్న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో తాజా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ మంగళవారం పర్యటించనున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకూ మోదీ వెళ్లి అక్కడి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. హిమాచల్లోని కంగ్రాకు మోదీ వెళ్లనున్నారు. అక్కడే ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. -
వేతనం వదులుకోనున్న ఎన్డీయే ఎంపీలు
న్యూఢిల్లీ: నిరసనలు, ఆందోళనల కారణంగా పార్లమెంటు బడ్జెట్ మలిదశ సమావేశాలు సజావుగా సాగకపోవటంతో.. ఈ 23 రోజుల వేతనాన్ని వదులుకునేందుకు అధికార ఎన్డీయే ఎంపీలు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ బుధవారం వెల్లడించారు. కాంగ్రెస్, ఇతర విపక్షాల అప్రజాస్వామిక తీరు కారణంగానే పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడుతున్నాయని విమర్శించారు. ప్రజలు చెల్లిస్తున్న పన్ను వృధా అవుతోందన్నారు. ‘ఈ విషయాన్ని ప్రధాని, బీజేపీ అధ్యక్షుడు, ఎన్డీయే పక్షాల అధ్యక్షులతో చర్చించాం. రెండోవిడత బడ్జెట్ సమావేశాలు జరిగిన 23 రోజుల వేతనాన్ని వదులుకోవాలని నిర్ణయించాం’ అని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాసం సహా పలు అంశాలపై చర్చకు సిద్ధమని ప్రకటించినా విపక్షాలు ఆందోళన చేయటం సరికాదని అనంత్ కుమార్ పేర్కొన్నారు. -
బీజేపీ దేశాన్ని కాపాడాలనుకుంటోంది: మోదీ
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న వైఖరి అత్యవసర రోజులను తలపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్న నిరాశతో ఒక కుటుంబాన్నే ఆ పార్టీ నమ్ముకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఒక కుటుంబాన్ని కాపాడాలనుకుంటోందని, బీజేపీ దేశాన్ని కాపాడాలనుకుంటోందని అన్నారు. ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి గురువారం ఆయన మాట్లాడారు. -
ఎన్డీఏ ఎంపీల పాదయాత్ర!
-
'రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్'
న్యూఢిల్లీ: రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్టు తెలిసింది. ఎన్డీఏ ఎంపీలకు ఆదివారం సాయంత్రం మోదీ తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీలకు ప్రభుత్వ పథకాలపై ప్రధాని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. పోలియో నిర్మూలించగలిగాం, స్వచ్ఛ భారత్ ను సాధించగలం అంటూ ఎంపీలను మోదీ ఉత్సాహరిచారు. నెహ్రూ జయంతి సందర్భంగా పాఠశాలలను సందర్శించి పరిశుభ్రత ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించాలన్నారు. పేదల సంక్షేమానికి సంబంధించి కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీలకు మోదీ సూచించినట్టు తెలుస్తోంది. -
ఈ నెల 26న ఎన్డీయే ఎంపీలకు మోడీ టీ పార్టీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి ఎన్డీయే ఎంపీలకు టీ పార్టీ ఇవ్వనున్నారు. ఈ నెల 26న మోడీ ఎంపీలతో సమావేశంకానున్నారు. ఈ టీ పార్టీకి శివసేన ఎంపీలు కూడా హాజరవుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనల మధ్య పొత్తు వికంటించడం, ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, శివసేన రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీలు మోడీ పార్టీకి హాజరుకానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.