తమ ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న వైఖరి అత్యవసర రోజులను తలపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న వైఖరి అత్యవసర రోజులను తలపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్న నిరాశతో ఒక కుటుంబాన్నే ఆ పార్టీ నమ్ముకుందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఒక కుటుంబాన్ని కాపాడాలనుకుంటోందని, బీజేపీ దేశాన్ని కాపాడాలనుకుంటోందని అన్నారు. ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి గురువారం ఆయన మాట్లాడారు.