ఛత్తీస్‌గఢ్ లో ఎదురుకాల్పులు.. మావోయిస్టుల మృతి! | maoists killed in chhattisgarh encounter! | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్ లో ఎదురుకాల్పులు.. మావోయిస్టుల మృతి!

Jan 27 2014 1:20 PM | Updated on Oct 9 2018 2:39 PM

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జాంగ్ల అడవిలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జాంగ్ల అడవిలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనలో కొంతమంది మావోయిస్టులు చనిపోయారని భావిస్తున్నారు. పోలీసులు నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement