ముంబై: పాకిస్థాన్తో క్రికెట్ సిరీస్ను తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఆ దేశ కళాకారులను, సినీ నటులను మహారాష్ట్ర గడ్డపై అడుగుపెట్టనీయబోమంటూ హెచ్చిరించిన శివసేన.. పాక్ ధీర బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ విషయంలో భిన్నంగా స్పందించింది. మలాలా భారత్కు ఎప్పుడు వచ్చినా స్వాగతం పలుకుతామని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ చెప్పారు.
'భారత్లోని శాంతిదూతలకు ఓ మాట చెబుతున్నా. పాకిస్థాన్లో ఉగ్రవాదంపై మలాలా పోరాటాన్ని శివసేన, సామ్నా అభినందిస్తోంది. మలాలా భారత్కు వస్తే శివసేన స్వాగతం పలుకుతుంది' అని సంజయ్ రౌత్ అన్నారు. కసూరి, హఫీజ్ సయీద్ వంటి వారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్లో హింసకు ప్రేరిపిస్తున్నారని, చిన్నమ్మాయి అయిన మలాలా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ నోబెల్ బహుమతిని గెల్చుకుందని చెప్పారు. మలాలాకు స్వాగతం పలికడం వల్ల.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరాదని భారత్లోని పాకిస్థాన్ ప్రేమికులకు సందేశాన్ని పంపినట్టు అవుతుందని అన్నారు. భారత్ను సందర్శించాలని ఉందని, బాలికల్లో స్ఫూర్తి నింపేందుకు ఢిల్లీ, ముంబై నగరాల్లో పర్యటించాలని ఉందని మలాలా ఇటీవల చెప్పారు.
'ఆ అమ్మాయి వస్తే.. స్వాగతం పలుకుతాం'
Published Wed, Oct 21 2015 7:18 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement