లోక్సభలో ముందువరుస సీట్లకు పోటీ | Lok Sabha seating plan likely to be okayed before winter session | Sakshi
Sakshi News home page

లోక్సభలో ముందువరుస సీట్లకు పోటీ

Oct 26 2014 3:42 PM | Updated on Sep 2 2017 3:25 PM

లోక్సభలో ముందువరుస సీట్లకు పోటీ

లోక్సభలో ముందువరుస సీట్లకు పోటీ

లోక్సభలో సీట్ల కేటాయింపు వచ్చే నెల నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.

ఢిల్లీ: లోక్సభలో సీట్ల కేటాయింపు వచ్చే నెల నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు గడుస్తున్నా లోక్సభలో సీట్ల కేటాయింపు కొలిక్కి  రాలేదు.  శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు కుర్చీల కేటాయింపు పూర్తయ్యే అవకాశముందని పార్లమెంట్  అధికారి ఒకరు తెలిపారు. ఏ పార్టీకి ఎక్కడ సీటింగ్ ఇవ్వాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. 

సోమవారం జరిగే  పార్లమెంటరీ వ్యవహారాల సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. ముందువరుస సీట్లకు పోటీ ఎక్కువగా ఉంది. ప్రతిపక్షం లేనందున ముందువరుస సీట్లను తమకు కేటాయించాలని మిగతా పక్షాలు కోరుతున్నాయి. కాంగ్రెస్ తో కలిసి సీట్లు పంచుకునేందుకు అన్నాడీఎంకే, తృణమూల్, బీజేడీ ఆసక్తి చూపకపోవడంతో కుర్చీల కేటాయింపు ఆలస్యమైంది. నవంబర్ 24 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement