బీజేపీ-శివసేనల పొత్తు కొనసాగాలి:అద్వానీ | lk Advani bats for Sena-BJP alliance | Sakshi
Sakshi News home page

బీజేపీ-శివసేనల పొత్తు కొనసాగాలి:అద్వానీ

Oct 19 2014 3:41 PM | Updated on Mar 29 2019 9:24 PM

బీజేపీ-శివసేనల పొత్తు కొనసాగాలి:అద్వానీ - Sakshi

బీజేపీ-శివసేనల పొత్తు కొనసాగాలి:అద్వానీ

మహారాష్ట్రలో బీజేపీ-శివసేనలు విడివిడిగా పోటీ చేసినా.. వారి మధ్య పొత్తు కొనసాగాలని బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ తెలిపారు.

న్యూఢిల్లీ:మహారాష్ట్రలో బీజేపీ-శివసేనలు విడివిడిగా పోటీ చేసినా.. వారి మధ్య పొత్తు కొనసాగాలని బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ అభిప్రాయపడ్డారు. తాజాగా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన అద్వానీ ఆ రెండు పార్టీల మధ్య పొత్తు భవిష్యత్తులో కొనసాగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రెండు పార్టీలు కలిసి మహారాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

'రెండు పార్టీలకు 25 ఏళ్ల సాన్నిహిత్యం ఉంది. అక్టోబర్ 15వ తేదీన వారి పొత్తు విచ్ఛిన్నం అయ్యింది. మళ్లీ తిరిగి ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది'అని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్సీపీ(నేషనల్ కాంగ్రెస్ పార్టీ)తో మద్దతు ఏమైనా కోరతారన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement