
విశాఖ : తూర్పు కనుమలను తిలకిస్తూ..సాగర సోయగాలను వీక్షిస్తూ..గాల్లో తేలియాడే సరికొత్త అనుభూతిని అందించేందుకు విశాఖలో మరో పర్యాటక ఆకర్షణ సిద్ధమవుతోంది.

పర్యాటకులను మంత్రముగ్ధులను చేసేందుకు కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్ రూపుదిద్దుకుంటోంది.

వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పునాది రాయి పడిన ఈ పర్యాటక ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి.

ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

రూ.10 కోట్ల వ్యయంతో పీపీపీ పద్ధతిలో చేపట్టిన ఈ ప్రాజెక్టు త్వరలో ప్రారంభానికి ముస్తాబవుతోంది.

గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ఎన్నడూలేని విధంగా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఇందులో భాగంగా కై లాసగిరిపై చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


