- ఇది సర్కారుకు సిగ్గుచేటు
- సీపీఎం కార్యదర్శి తమ్మినేని
సాక్షి, హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యల్లోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది తప్ప మరేమీ లేదని, ప్రస్తుత పాలకవర్గానికి ఇది సిగ్గుచేటని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. మంగళవారం ఎంబీభవన్లో పార్టీనాయకులు డీజీ నరసింహారావు, ఎం.శ్రీనివాస్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంపద పెరుగుతుందని, అందరి బతుకులు బాగుపడతాయని భావిస్తే ఆత్మహత్యల్లో అభివృద్ధి ఉంటోందని ఎద్దేవా చేశారు. ఈ నెల 23న అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోగా రైతాంగ సమస్యలతోపాటు పట్టణప్రాంతాల్లోని ప్రజల పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బీసీ సబ్ప్లాన్, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు నిబంధనలు రూపొందించి, మైనారిటీలకు సబ్ప్లాన్, ప్రైవేట్రంగంలో రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మహత్యల పరంపర సాగుతుంటే పాలకపక్షంలో అసలు స్పందనే లేదని, వాస్తవానికి 1300 మందిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. వీటన్నింటిపై ప్రభుత్వపరంగా స్పందన లేకపోతే అసెంబ్లీలో, బయట కార్యాచరణను రూపొందిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్సిటీల విషయంలో తెలంగాణ పట్ల వివక్షను ప్రదర్శిస్తోందన్నారు. స్మార్ట్సిటీల పథకం గతంలో జేఎన్యూఆర్ఎంకు కొనసాగింపేనని ఎం.శ్రీనివాస్ తెలిపారు.
రేపు వరంగల్ వామపక్ష అభ్యర్థి ప్రకటన
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగే బహిరంగసభలో వరంగల్ లోక్సభ ఉపఎన్నికల్లో పోటీచేసే వామపక్షాల అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఉప ఎన్నికల్లో పోటీ విషయంలో ప్రజాగాయకుడు గద్దర్ సానుకూలంగానే ఉన్నా ఇది ఇంకా ఖరారు కాలేదన్నారు. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థి విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని మంగళవారం ఆయన మీడియాకు చెప్పారు. కిష్టారెడ్డి మృతి కార ణంగా మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లోనూ వామపక్షాల తరఫున అభ్యర్థిని నిలపనున్నట్లు చెప్పారు.
రైతుల ఆత్మహత్యల్లోనే తెలంగాణ అభివృద్ధి
Published Wed, Sep 9 2015 2:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement