చిన్న పొదుపు దారుల ఆశలపై నీళ్లు | Govt slashes small saving schemes interest rates by 0.1% | Sakshi
Sakshi News home page

చిన్న పొదుపు దారుల ఆశలపై నీళ్లు

Mar 31 2017 12:10 PM | Updated on Sep 5 2017 7:35 AM

కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) , ఇతర చిన్న పొదుపు ఖాతాలపై వడ్డీరేటులో కోత పెట్టింది.

న్యూడిల్లీ:  కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపుదారులకు తీరని నిరాశను మిగిల్చింది.   చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) , ఇతర చిన్న పొదుపు ఖాతాలపై వడ్డీరేటులో కోత పెట్టింది. పీపీఎఫ్‌ సహా, చిన్న పొదుపు ఖాతాలపై 0.1 శాతం వడ్డీ రేటును తగ్గిస్తూ   ప్రభుత‍్వం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.  దీని ప్రకారం వీటిపై   ప్రస్తుత వడ్డీరేటు 8 శాతం, రేపటినుంచి 7.9శాతంగా ఉండనుంది. పీపీఎఫ్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర, సుకన్య సమృద్ధి స్కీం, సీనియర్‌ సిటిజెన్స్‌  సేవింగ్స్‌ స్కీమ్‌ ఖాతాదారులపై దీని ప్రభావం పడనుంది.

ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా, ఏప్రిల్ 1, 2017 నుంచి ప్రారంభమయ్యే 2016-17 నాలుగో త్రైమాసికంలో  ఈ వడ్డీ రేట్ల తగ్గించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి  ఈ ఆ దేశాలు అమల్లోకి రానున్నట్టు స్పష్టం చేసింది.  దీంతో చిన్నమొత్తాల్లో పొదుపు చేసుకునే   ఖాతాదారుల నడ్డి విరిచింది. వారి ఆశలపై నీళ్లు చల్లింది.

మరోవైపు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో  దేశీయబ్యాంకులు కూ పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లలో కోత పెట్టే అవకశాలు  మెండుగా కనిపిస్తున్నాయి.  రుణాల జారీ వృద్ధి మందగించడంతో బ్యాంకులు తమ నిర్వహణ లాభాలను పెంచుకునేందుకు సేవింగ్స్‌ ఖాతాలనిల్వలపై వడ్డీ రేట్ల కోత తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement