తాత్కాలిక సచివాలయంలో గవర్నర్, సీఎం | governor narasimhan visits ap temporary Secretariat in velagapudi | Sakshi
Sakshi News home page

తాత్కాలిక సచివాలయంలో గవర్నర్, సీఎం

Jul 7 2016 10:43 AM | Updated on Aug 21 2018 11:41 AM

తాత్కాలిక సచివాలయంలో గవర్నర్, సీఎం - Sakshi

తాత్కాలిక సచివాలయంలో గవర్నర్, సీఎం

వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు.

అమరావతి: వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్కు మంత్రులు స్వాగతం పలికారు. సచివాలయ బ్లాక్లను గవర్నర్ పరిశీలించారు. చంద్రబాబు నాయుడు బ్లాక్ ల నిర్మాణాలను గవర్నర్ కు వివరించారు.

గవర్నర్ ఈ రోజు ఉదయం విజయవాడలో కనకదుర్గ అమ్మవారి, ఆ తర్వాత మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పుష్కరాల ప్రారంభం అవుతున్న సందర్భంలో అందరికీ మంచి జరగాలని  కోరుకున్నట్లు  తెలిపారు. గవర్నర్ ఈ రోజు సాయంత్రం తిరుమల చేరుకుని, వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని, అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు.

కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో గవర్నర్ నరసింహన్కు విందు ఇచ్చారు. అంతకు ముందు విజయవాడలోని ఓ హోటల్‌లో గవర్నర్‌తో చంద్రబాబు 15 నిమిషాలపాటు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఇటీవల గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు తన నివాసానికి విందుకు రావాల్సిందిగా మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement