ఆర్బీఐ గవర్నర్ ఎంపిక నేడే? | Government could take call on Raghuram Rajan's successor today | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ గవర్నర్ ఎంపిక నేడే?

Aug 18 2016 1:10 PM | Updated on Sep 4 2017 9:50 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎంపికపై గురువారం సాయంత్రం సమావేశం కానున్నారు.

న్యూఢిల్లీ:  గత కొంతకాలంగా ఆసక్తికర చర్చకు  దారితీసిన  ఆర్బీఐ గవర్నర్ పదవిని అలంకరించే అభ్యర్థి ఎంపిక పై కేంద్ర ప్రభుత్వం నేడు (గురువారం)  ఓ నిర్ణయం తీసుకోనుంది.   ఈ మేరకు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  ఈ సాయంత్రం సమావేశం కానున్నారు.  దీంతో కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎంపికపై గురువారం ఒక ప్రకటన  వెలువడనుందని తెలుస్తోంది.   


కాగా  ప్రస్తుత  గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ కాలం ఈ సెప్టెంబర్ 4 తో ముగియనుంది.  రెండవసారి గవర్నర్ పదవిని చేపట్టబోననని రాజన్ స్పష్టం చేయడంతో ఈ పదవి ఎవర్ని వరించనుందనే అంశంపై పలు అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆర్ బీఐ గవర్నర్ సుబీర్ గోకర్న్,   డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్,  ఎస్ బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య తదితర  పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న  సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement