హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సేవల రంగంలో ఉన్న ఎడల్వీస్ అనుబంధ కంపెనీ ఈసీఎల్ ఫైనాన్స్ రూ.500 కోట్ల నాన్ కన్వర్టబుల్ డిబెం చర్స్ను జారీ చేస్తోంది. ఈ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తాన్ని వ్యాపార విస్తరణకు వినియోగించనున్నట్లు ఎడల్వీస్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో దీపక్ మిట్టల్ తెలిపారు. ఎన్సీడీ ఇష్యూ వివరాలను తెలియచేయడానికి శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3, 5 ఏళ్ల కాలపరిమితిలో జారీ చేస్తున్న ఈ ఎన్సీడీలపై వరుసగా 11.6%, 11.85% వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు.
రూ.1,000 ముఖ విలువ కలిగిన ఈ బాండ్లను కనీసం పది కొనాల్సి ఉంటుంది. జనవరి 16న ఈ ఇష్యూ ప్రారంభమవుతుందని, జనవరి 27 వరకు చివరి తేదీ ఉన్నప్పటికీ ఓవర్సబ్స్క్రైబ్ అయితే ముందుగానే ముగిస్తామన్నారు. ప్రస్తుతం రిటైల్, ఎస్ఎంఈ రంగాలపై అధికంగా దృష్టిసారిస్తున్నామని, వడ్డీ లాభదాయకతపై ఎటువంటి ఒత్తిడి లేదని ఎడల్వీస్ రిటైల్ ఫైనాన్స్ హెడ్ అనిల్ కొత్తూరి తెలిపారు. ఈ ఇష్యూకి కేర్ ఏఏ రేటింగ్ ఇచ్చింది.
ఎడల్వీస్ 500 కోట్ల ఎన్సీడీ ఇష్యూ
Published Sun, Jan 12 2014 3:00 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement