పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం | December WPI rises to 3.39% | Sakshi
Sakshi News home page

పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం

Jan 16 2017 12:41 PM | Updated on Sep 5 2017 1:21 AM

2016 డిసెంబర్ నెల టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) లేదా టోకు ద్రవ్యోల్బణం 3.39గా నమోదైంది.

న్యూఢిల్లీ:  2016  డిసెంబర్ నెల టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) లేదా టోకు ద్రవ్యోల్బణం 3.39గా నమోదైంది. మునుపటి నెలలో 3.15 శాతంతో పోలిస్తే ఇది 1.06 శాతం ఎక్కువ.  ఆహార ద్రవ్యోల్బణం రేటు (ఇయర్ ఆన్ ఇయర్ ) -0.70 శాతంగా నమోదైంది. గత నెల 1.54తో పోలిస్తే క్షీణించి  2015  ఆగస్టు తరువాత మొదటి సారి నెగిటివ్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఈ వివరాలను  వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ  ఒక ప్రకటనలో తెలిపింది.  డిసెంబర్ నెలలో 'ఆల్ కమోడిటీస్' టోకు ధర సూచిక 182.8 (తాత్కాలిక) గా నమోదైంది. గత నెలలో (తాత్కాలిక) 183.1 తో  పోలిస్తే  0.2 శాతం తగ్గింది.

కాగా డిసెంబర్ 31, 2016తో ముగిసిన  డీమానిటైజేషన్ నేపథ్యంలో   డబ్ల్యుపిఐ గణాంకాలు కీలకంగా మారనున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement