'రాజస్థాన్' ఘటనను ఖండించిన సీపీఎం | CPI-M condemns atrocity against woman in Rajasthan village | Sakshi
Sakshi News home page

'రాజస్థాన్' ఘటనను ఖండించిన సీపీఎం

Nov 11 2014 8:42 PM | Updated on Oct 16 2018 8:34 PM

రాజస్థాన్ లో ఓ మహిళను అర్థనగ్నంగా గాడిదపై ఊరేగించిన ఘటనను సీపీఎం ఖండించింది.

జైపూర్: రాజస్థాన్ లో ఓ మహిళను అర్థనగ్నంగా గాడిదపై ఊరేగించిన ఘటనను సీపీఎం ఖండించింది. బాధితురాలు తన మేనల్లుడిని హత్యచేసిందన్న ఆరోపణతో కొంత మంది పంచాయతీ పెద్దలు ఈ దారుణానికి ఒడిగట్టారు.

బీజేపీ 11 నెలల పాలనలో మహిళలపై దాడులు, వేధింపులు పెరిగిపోయాయని సీపీఎం నాయకుడు వసుదేవ్ ధ్వజమెత్తారు. వసుంధరా రాజే పాలనలో రాష్ట్రంలో పరిస్థితి అదుపుతప్పిందని విమర్శించారు. మహిళ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అతివలను అవమానించే, అగౌరపరిచే సంఘటనలు పెచ్చుమీరుతుండడం దారుణమని అన్నారు.

బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. రాజస్మానంద్ జిల్లాలోని తురవాద్ గ్రామంలో 45 ఏళ్ల మహిళను ఈనెల 8న అర్థనగ్నంగా గాడిదపైఊరేగించడం సంచలనం రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement