కేజ్రీవాల్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు | Congress complains to EC against Kejriwal | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

Jan 19 2015 2:58 PM | Updated on Sep 2 2017 7:55 PM

అజయ్ మాకెన్(ఫైల్)

అజయ్ మాకెన్(ఫైల్)

వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.

న్యూఢిల్లీ: వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్, బీజేపీల నుంచి డబ్బులు తీసుకుని తమ పార్టీకి ఓటు వేయాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తెలిపారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు బాధ్యతారహితమే కాకుండా రాజ్యాంగ విరుద్దమన్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. వచ్చేనెల 7న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement