రాజన్‌తో చిదంబరం భేటీ | Chidambaram meets Rajan as Re plumbs new low | Sakshi
Sakshi News home page

రాజన్‌తో చిదంబరం భేటీ

Aug 22 2013 3:10 AM | Updated on Jul 29 2019 6:59 PM

రాజన్‌తో చిదంబరం భేటీ - Sakshi

రాజన్‌తో చిదంబరం భేటీ

రూపాయి రికార్డు స్థాయి పతనం, స్టాక్ మార్కెట్లు కుదేలవడం... ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి పి. చిదంబరం మూడో రోజు కూడా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: రూపాయి రికార్డు స్థాయి పతనం, స్టాక్ మార్కెట్లు కుదేలవడం... ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి పి. చిదంబరం మూడో రోజు కూడా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న రఘురామ్ రాజన్‌తో పాటు వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల భారత విభాగపు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు(ఈడీ)లతో కూడా ఆయన సమావేశాలు జరిపారు. ముకేష్ ప్రసాద్(వరల్డ్ బ్యాంక్ ఈడీ). రాకేష్ మోహన్(అంతర్జాతీయ ద్రవ్య సంస్థ-ఐఎంఎఫ్), ఉమేష్ కుమార్(ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్)లతో ఆయన సమావేశం జరిపారు. ఈ సమావేశాల కారణంగా భారత్ నిధుల కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించనున్నదనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement